AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: డోలు బీట్‌కు స్టెప్పులేసిన రోహిత్.. జత కలిసిన కోహ్లీ, హార్దిక్.. వీడియో చూస్తే మీరూ చిందేస్తారంతే..

T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతోపాటు విజేత భారత జట్టు ఆటగాళ్లు అద్భుతమైన విజయ పరేడ్ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియం చేరుకున్నారు. ఇక్కడ ఆటగాళ్లు బస్సు దిగి స్టేడియంలోకి రాగానే డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఎంతో బాగా డ్యాన్స్ చేశారు.

Video: డోలు బీట్‌కు స్టెప్పులేసిన రోహిత్.. జత కలిసిన కోహ్లీ, హార్దిక్.. వీడియో చూస్తే మీరూ చిందేస్తారంతే..
Team India Players Dance
Venkata Chari
|

Updated on: Jul 05, 2024 | 9:35 AM

Share

T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతోపాటు విజేత భారత జట్టు ఆటగాళ్లు అద్భుతమైన విజయ పరేడ్ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియం చేరుకున్నారు. ఇక్కడ ఆటగాళ్లు బస్సు దిగి స్టేడియంలోకి రాగానే డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఎంతో బాగా డ్యాన్స్ చేశారు. ఆటగాళ్లందరూ డ్యాన్స్ చేస్తూ స్టేడియం లోపలికి చేరుకుని ప్రేక్షకుల వైపు చూస్తూ మరింత ఉత్సాహంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ డ్యాన్స్, పాటలతో భారత ఆటగాళ్లను నడిపించి రచ్చ చేశాడు.

దాదాపు రెండు గంటల పాటు సాగిన విజయోత్సవ కవాతు అనంతరం భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియం చేరుకున్నారు. నారిమన్ పాయింట్ నుంచి ప్రారంభమైన విజయోత్సవ కవాతులో లక్షలాది మంది అభిమానులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారత ఆటగాళ్లతో కూడిన ఓపెన్ బస్సు స్టేడియానికి చేరింది. ఈ సమయంలో, భారత ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ట్రోఫీతో ఎన్నో రకాల వేడుకలు చేశాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. ఈ సమయంలో అభిమానులు కూడా ఫుల్ ఉత్సాహంలో ఉన్నారు. చాలా మంది చెట్లు ఎక్కి తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత ఆటగాళ్లతో ఫొటోలు దిగారు.

చక్ దే ఇండియా..

రోహిత్ శర్మ సారథ్యంలో భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకోగానే ‘చక్ దే ఇండియా’ అంటూ హోరెత్తింది. దీంతో పాటు ముంబై సంప్రదాయ డోలు, తాళాలు వాయించారు. ఆ ట్యూన్ ఎంతగానో మంత్రముగ్దులను చేసింది. టీమిండియా ఆటగాళ్లు కూడా డ్యాన్స్ చేయకుండా ఆగలేకపోయారు. ఎంట్రీ ఇచ్చిన వెంటనే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిన ఆటగాళ్లు ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఆటగాళ్లంతా కలిసి భాంగ్రా ప్రదర్శన చేశారు. ఇది చూసి స్టేడియంలో వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. డీజే తర్వాత వివిధ డ్యాన్స్‌లతో అలరించారు. ప్రతి ఒక్కరూ ట్యూన్‌లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..