AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: గంభీర్ హయాంలో మారనున్న లక్.. ఈ ఫ్లాప్ ఆటగాడికి మరోసారి భారత జట్టులో చోటు?

India vs Sri Lanka Series: శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. ఈ పర్యటనలో భారత జట్టు 3 టీ20ఐలు, 3 ODIల సిరీస్‌లను ఆడనుంది. ఈ సిరీస్ నుంచి గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ పర్యటనకు ఎంపికైన జట్లలో అనేక ఆశ్చర్యకరమైన నిర్ణయాలను చూడొచ్చు. ఇదిలా ఉంటే టీమిండియా జట్టుకు సంబంధించిన ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది.

IND vs SL: గంభీర్ హయాంలో మారనున్న లక్.. ఈ ఫ్లాప్ ఆటగాడికి మరోసారి భారత జట్టులో చోటు?
Riyan Parag Vs Sl
Venkata Chari
|

Updated on: Jul 18, 2024 | 6:17 PM

Share

Team India: శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. ఈ పర్యటనలో భారత జట్టు 3 టీ20ఐలు, 3 ODIల సిరీస్‌లను ఆడనుంది. ఈ సిరీస్ నుంచి గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ పర్యటనకు ఎంపికైన జట్లలో అనేక ఆశ్చర్యకరమైన నిర్ణయాలను చూడొచ్చు. ఇదిలా ఉంటే టీమిండియా జట్టుకు సంబంధించిన ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఈ పర్యటన కోసం, తన కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేయలేకపోయిన ఆటగాడికి జట్టులో అవకాశం లభించవచ్చని తెలుస్తోంది.

గంభీర్ హయాంలో ఈ ఆటగాడి అదృష్టం మారనుందా?

శ్రీలంక పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడం ఖాయం. అదే సమయంలో భవిష్యత్తు కోసం ఈ టూర్‌లో కొత్త ముఖాలకు కూడా సెలక్షన్ కమిటీ అవకాశం ఇవ్వవచ్చని వార్తలు వచ్చాయి. ఇందులో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ పేరు ముందు వరుసలో ఉంది. మీడియా కథనాల ప్రకారం, ఈ పర్యటన కోసం T20, ODI సిరీస్ కోసం రియాన్ పరాగ్‌ను జట్టులో చేర్చవచ్చు. రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ చేస్తాడు. కాబట్టి, అతను సెలెక్టర్లకు బెస్ట్ ఆఫ్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.

జింబాబ్వే టూర్‌లో ప్రదర్శన..

రియాన్ పరాగ్‌ను గతంలో జింబాబ్వే సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 24 ఏళ్ల రియాన్‌ పరాగ్‌కు టీమిండియా తరపున ఇది తొలి సిరీస్. కానీ, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అంటే అరంగేట్రం మ్యాచ్‌లో 3 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత అతనికి ఆడే అవకాశం రాకపోవడంతో బెంచ్‌పైనే కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతను 24 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. అయితే ఇప్పుడు అతనికి మరో అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.

ఈ స్టార్ ప్లేయర్‌ని భర్తీ చేస్తాడు..

మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా రియాన్ పరాగ్ చోటు దక్కించుకుంటే, సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అతనే బరిలోకి దిగుతున్నాడు. అంటే, సూర్యకుమార్ వన్డే జట్టులో భాగం కావడం లేదు. అదే సమయంలో, నివేదికల ప్రకారం, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ కూడా టీ20 జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

మరన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..