AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant Update: రంగంలోకి బీసీసీఐ.. పంత్‌ను ముంబై తరలించే ఛాన్స్.. అవసరమైతే విదేశాలకు..

రిషబ్ పంత్ నుదుటిపైన, వీపుపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లోనే జరిగింది. అయితే అతన్ని కొద్ది రోజుల్లో ఇక్కడి నుంచి ముంబైకి తరలించనున్నారు.

Rishabh Pant Update: రంగంలోకి బీసీసీఐ.. పంత్‌ను ముంబై తరలించే ఛాన్స్.. అవసరమైతే విదేశాలకు..
Rishabh Pant
Venkata Chari
|

Updated on: Dec 31, 2022 | 2:36 AM

Share

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌ను వీలైనంత త్వరగా కోలుకునేందుకు కావాల్సిన చర్యలను తీసుకునేందుకు రంగంలోకి దిగింది. డిసెంబర్ 30 శుక్రవారం ఉదయం రూర్కీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాధితుడైన రిషబ్ పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చికిత్స పొందుతున్నాడు. అదృష్టవశాత్తూ, పంత్‌కు పెద్దగా గాయాలు కాలేదు. అయితే, అతని జీవితానికి లేదా కెరీర్‌కు ఎటువంటి ముప్పు లేదు. కాగా, ప్రస్తుతం బీసీసీఐ రిషబ్ పంత్‌ను కొద్దిరోజుల్లోనే ముంబైకి తరలించేందుకు సిద్ధమైంది. అవసరమైతే ఆయనను విదేశాలకు పంపవచ్చవని తెలుస్తోంది.

పంత్‌కు మాక్స్ హాస్పిటల్‌లో చికిత్స జరుగుతోంది. ఇక్కడ ముఖం, వెనుక గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. మెదడు, వెన్నెముకను ఎంఆర్‌ఐ కూడా తీశారు. ఇది పూర్తిగా సాధారణమైనది. అయితే, పంత్‌కు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అతని మోకాలి స్నాయువు చిట్లిపోయింది. ఈ గాయం అతను మైదానంలోకి తిరిగి రావడానికి అతిపెద్ద అడ్డంకిగా మారనుంది. బీసీసీఐ రంగంలోకి దిగడం కారణం ఇదే.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల వార్తాపత్రికలోని నివేదిక ప్రకారం, బీసీసీఐ వైద్య బృందం ఇప్పుడు పంత్ స్నాయువు గాయానికి చికిత్స చేస్తుంది. పంత్‌కు ప్రమాదం జరిగినప్పటి నుంచి బీసీసీఐ వైద్యులు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అతని చికిత్స గురించి సమాచారం తీసుకుంటున్నారు. ఇప్పుడు డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి బీసీసీఐ వైద్యులు మాత్రమే లిగమెంట్ చికిత్సకు పూర్తి బాధ్యత తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం, పంత్‌ను కొద్ది రోజుల్లో డెహ్రాడూన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, ఆపై ముంబైకి తరలించనున్నారు. ముంబైలోని బీసీసీఐ వైద్యులు లిగమెంట్ గాయం పరిస్థితిని తనిఖీ చేసి, గాయం గ్రేడ్‌ను చూస్తారంట. ఆ తర్వాత పంత్‌ను చికిత్స నిమిత్తం విదేశాలకు పంపించాలా వద్దా అనేది నిర్ణయించనున్నారు. రిషబ్ పంత్ భారత క్రికెట్ స్టార్ ప్లేయర్‌ మాత్రమే కాదు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ కూడా. అటువంటి పరిస్థితిలో పంత్ బాధ్యత మొత్తం బోర్డుపైనే ఉంది.

అయితే ఈ గాయం నుంచి రిషబ్ పంత్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎంతకాలంలో తిరిగి రాగలడనే విషయంపై క్లారిటీ లేదు. ఇది గాయం తీవ్రత, దాని చికిత్సపై ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, భారత జట్టు, రిషబ్ పంత్ టీమ్ ఇండియా అభిమానులు అతను వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..