Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ నడిచిందా? నిజాలు పచ్చిగా మాట్లాడుకుంటే..
రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్ కెరీర్కు అనూహ్యంగా ముగింపు పలికాడు. అతని రిటైర్మెంట్కు కారణం ఫామ్లో లేకపోవడం అని అందరూ అనుకుంటున్నారు కానీ, నిజానికి కెప్టెన్సీ మార్పు కూడా కారణం కావచ్చు. బీసీసీఐ నిర్ణయంతో అతను ఏకీభవించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనికి సరైన గౌరవం దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఒక వైపు పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్తో విరుచుకుపడితే.. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగింది. ఉదయం నుంచి సాయంత్ర వరకు అంతా ఆపరేషన్ సిందూర్ గురించే మాట్లాడుకున్నారు. కానీ, రాత్రి 7 గంటల ప్రాంతంలో కొంతమంది క్రికెట్ అభిమానులు షాక్కు గురయ్యారు. ఎవ్వరూ ఊహించని విధంగా టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సాంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాదు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక ఫోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో ఫామ్లోకి అదరగొడుతున్నాడని ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్న టైమ్లో రోహిత్ ఈ విధంగా షాకిచ్చాడు. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
ఈ సిరీస్లో రోహిత్ శర్మ కచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తాడని అంతా బలంగా నమ్మారు. ఎందుకంటే.. కొన్ని నెలలుగా టెస్టుల్లో రోహిత్ సరైన ఫామ్లో లేడు. ఐపీఎల్ కంటే ముందు గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టులు సిరీస్లో రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. మొత్తం జట్టు కూడా ఫేలవ ప్రదర్శన కనబర్చింది. ఒక కెప్టెన్గా, ఓపెనర్గా రోహిత్ వైఫల్యం టీమ్పై ప్రభావం చూపించింది. తన బ్యాడ్ను గుర్తించిన రోహిత్.. తానే స్వయంగా బీజీటీలోని చివరి మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఫైనల్ మ్యాచ్ మినహా టోర్నీలో పెద్దగా రాణించలేదు. ఇక ఐపీఎల్లోనూ ఆరంభంలో దారుణంగా విఫలం అయ్యాడు. కానీ, ఇటీవలె తన ఫామ్ను అందుకున్నాడు.
దీంతో.. ఇక టీమిండియా ఆడబోయే తర్వాత సిరీస్లలో కూడా రోహిత్ ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. 2024లో తన కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోహ్లీతో పాటే రోహిత్ కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మిగతా రెండు ఫార్మాట్స్లతో కొనసాగుతానని, తనలో ఇంకా క్రికెట్ మిగేలే ఉందంటూ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ గెలిచి వన్డే ఫార్మాట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పుకార్లు వచ్చిన నేపథ్యంలో.. విరాట్ కోహ్లీతో కలిసి ఫొటో దిగుతూ.. మన రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నాయ్.. ఒక ఫొటో దిగుదాం రా అంటూ రిటైర్మెంట్ ఇవ్వడం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ, ఇంత సడెన్గా టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ఎందుకిచ్చాడనే డౌట్ మాత్రం అందరిలో ఉంది. ఫామ్ లేడు అందుకే రిటైర్మెంట్ ఇచ్చాడు అని చాలా మంది అనుకుంటున్నారు.
కానీ, చాలా మందికి దిమ్మతిరిగే నిజం ఏంటంటే.. 2019 నుంచి ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ రోహిత్ శర్మనే. 2019 నుంచి 2024 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ లో 2716 పరుగులు చేశాడు. అతని తర్వాత శ్రీలంక ఆటగాడు కరుణరత్నే 2642 పరుగులతో రెండో ప్లేస్లో ఉన్నాడు. 2617 పరుగులతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. అయినా కూడా రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక బ్యాడ్ ఫామ్ కారణమని చాలా మంది నమ్ముతున్నారు. అయితే అది పూర్తిగా నిజం కాదనే వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. ఎస్.. బీజీటీతో పాటు న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లలో రోహిత్ శర్మ ఫామ్లో లేడు. కానీ, అంతకంటే ముందు చాలా బాగా ఆడాడు. పైగా.. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది కదా.. ఇంగ్లండ్లో రోహిత్ శర్మ మంచి రికార్డ్ ఉంది. 44 కంటే ఎక్కువ సగటుతో రోహిత్ శర్మ ఇంగ్లండ్ పిచ్లపై రన్స్ సాధించాడు.
ఇదంతా రోహిత్ శర్మ, సెలెకర్లు ఆలోచించి ఉండరంటారా? కచ్చితంగా ఇవన్నీ వాళ్లకు తెలుసు.. కానీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ వెనుక బ్యాడ్ ఫామ్ మాత్రమే కాదు.. అసలైన కారణం వేరే ఉంది. అదే కెప్టెన్సీ మార్పు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ కోసం రోహిత్ శర్మ స్థానంలో మరో ప్లేయర్ను కెప్టెన్ చేయాలని బీసీసీఐ, సెలెక్టర్లు భావించారు. ఇదే విషయాన్ని రోహిత్ శర్మతో చెప్పినట్లు సమాచారం. నిజానికి ఆ విషయం రోహిత్తో చర్చించారా? లేదా అన్నది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. కానీ, ఈ మధ్య లీకులు ఎక్కువైపోతున్నాయి కదా.. అలానే రోహిత్ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే వార్తలు ఏకంగా నేషనల్ మీడియాలో వచ్చాయి. అలా వార్తలు వచ్చిన రెండు గంటల్లోనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఒక వేళ కెప్టెన్సీతో రోహిత్తో బీసీసీఐ చర్చించి ఉంటే.. అందుకే రోహిత్ ఒప్పుకోకపోయి ఉండాలి, అయినా కూడా బీసీసీఐ కెప్టెన్సీ మార్పుకు పట్టుబట్టి ఉండటంతోనే రోహిత్ ఒక చేసేదేం లేక ఏకంగా టెస్టులకే రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలి.
ఎందుకంటే.. తాను కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ రోహిత్ ఇటీవలె ప్రకటించాడు. ఇంతలో కెప్టెన్సీ నుంచి తీసేస్తాం అంటే రోహిత్ ఒప్పుకుంటాడా? బ్యాటర్గా ఓ రెండు సిరీస్లు సరిగ్గా ఆడలేదు అంతే.. కానీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడింది. అదే ఏడాది ఆసియా కప్ గెలిచింది, 2023 వన్డే వరల్డ్ కప్లో వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్కు వెళ్లింది. ఆ టోర్నీలో టీమిండియా ఓడించని టీమ్ లేదు. ఫైనల్లో మనపై గెలిచి కప్పు కొట్టిన ఆస్ట్రేలియాను కూడా లీగ్ దశలో టీమిండియా ఓడించింది. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇదంతా.. రోహిత్ శర్మ కెప్టెన్గా మూడేళ్లలోనే చేసి చూపించాడు. ఇంత చేసిన వ్యక్తిని ఉన్నపళంగా కెప్టెన్సీ నుంచి తప్పిస్తామని చెప్పడంతో రోహిత్ హార్ట్ అయ్యాడని సమాచారం.
పైగా ఇంత సాధించిన ఒక ప్లేయర్ కమ్ కెప్టెన్కు సరైన ఫేరవల్ లేకుండా చేసింది బీసీసీఐ. ఒక వేళ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించాలని అనుకుంటే.. ఇంగ్లండ్తో తొలి టెస్ట్ ఆడించి.. సరైన పేరవల్ ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఒక దిగ్గజ ప్లేయర్కు మినిమం గౌరవం ఇవ్వాలి. జట్టు కోసం ఎంతో చేసిన ప్లేయర్కు ఆ మాత్రం రెస్పెక్ట్ కచ్చితంగా ఇచ్చి తీరాలి. ఆ విధంగా బీసీసీఐ కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. కెప్టెన్సీ విషయంలో రోహిత్కు సరైన విధంగా కన్వె చేయకపోవడమో.. లేద కాస్త మొండిగా తాము చెప్పింది వినాల్సిందే అని వ్యవహరించడమో జరిగి ఉంటేనే రోహిత్ ఈ విధంగా సడెన్ రిటైర్మెంట్ తీసుకున్నాడని అనుకోవచ్చు. ఏది ఏమైనా.. భారత టెస్ట్ క్రికెట్ ఒక మంచి ప్లేయర్ని అయితే కచ్చితంగా మిస్ అవుతుంది. మరి వన్డేల్లో అయినా రోహిత్కు సరైన పేరవల్ బీసీసీఐ ఇస్తుందని ఆశిద్దాం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి