AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy: ఇదేందిది.. ఇదెప్పుడూ చూడలే.. ఒక్క రోజులో 21 వికెట్లు.. దుమ్మురేపిన బౌలర్లు..

రంజీ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు.. తమదైన ముద్ర వేయడంతో బ్యాట్స్‌మెన్‌లు వికెట్‌పై నిలవడం కష్టంగా మారింది. మ్యాచ్‌లో రెండో రోజు వికెట్లు ఆకుల్లా రాలిపోయాయి.

Ranji Trophy: ఇదేందిది.. ఇదెప్పుడూ చూడలే.. ఒక్క రోజులో 21 వికెట్లు.. దుమ్మురేపిన బౌలర్లు..
Ranji Trophy 2022
Venkata Chari
|

Updated on: Jun 08, 2022 | 6:51 AM

Share

క్రికెట్ ప్రస్తుతం బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారిందని అంటున్నారు. టీ20, వన్డే మ్యాచ్‌లు చూస్తుంటే ఈ విషయం కూడా నిజమే అనిపిస్తుంది. కానీ, ఎర్ర బంతి విషయానికి వస్తే మాత్రం నేటికీ బౌలర్లు ఇక్కడే ఉన్నారు. ఈ విషయం కూడా నిరంతరంగా కనిపిస్తూనే ఉంది. భారతదేశంలో అతిపెద్ద దేశీయ టోర్నమెంట్ – రంజీ ట్రోఫీలో కూడా ఈ లక్షణం కనిపించింది. ప్రస్తుతం రంజీ ట్రోఫీ(Ranji Trophy) లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అందులో ఒక మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతాలు చేశారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్ (Karnataka vs Uttar Pradesh) మధ్య జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెండో రోజు మంగళవారం మొత్తం 21 వికెట్లు పడిపోవడంతో ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

రెండోరోజు ఏడు వికెట్లకు 213 పరుగుల ముందు ఆడుతున్న కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో మరో 40 పరుగులు జోడించింది. శ్రేయాస్ గోపాల్ 80 బంతుల్లో 56 (సిక్స్ ఫోర్లు, రెండు సిక్సర్లు)తో నాటౌట్‌గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్ తరపున సౌరభ్ కుమార్ నాలుగు, శివమ్ మావి మూడు, యశ్ దయాల్ రెండు వికెట్లు తీశారు.

యూపీ బ్యాట్స్‌మెన్ చెలరేగారు..

ఉత్తరప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌటైంది. జూనియర్ వరల్డ్ కప్ స్టార్ ప్రియమ్ గార్గ్ 39 పరుగులతో టాప్ స్కోర్ చేయగా, ఐపీఎల్ డిస్కవర్ రింకు సింగ్ 33, మావీ 32 పరుగులు చేశారు. ప్రియమ్ తన ఇన్నింగ్స్‌లో 59 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు కొట్టాడు. రింకు 42 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, మావీ 35 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టారు. యష్ 13 పరుగులు అందించాడు. అంకిత్ రాజ్‌పుత్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కర్ణాటక తరపున రోనిత్ మోరే మూడు వికెట్లు తీయగా, విజయ్‌కుమార్‌ వి, కె గౌతమ్‌, వి కవేరప్ప రెండేసి వికెట్లు తీశారు.

కర్ణాటకకు పేలవ ఆరంభం..

తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌ను చాలా పేలవంగా ప్రారంభించింది. స్కోరు బోర్డులో 35 పరుగులు మాత్రమే ఉన్న సమయంలో ఓపెనర్లిద్దరూ 12వ ఓవర్‌లో పెవిలియన్‌కు చేరుకున్నారు. మయాంక్ అగర్వాల్ 22 పరుగులతో టాప్ స్కోర్ చేయగా, కెప్టెన్ మనీష్ పాండే నాలుగు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీనివాస్ శరత్ పది పరుగులు చేసి ఆడుతున్నాడు. ప్రస్తుతం కర్ణాటక రెండు వికెట్లు మిగిలి ఉండగానే 198 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌ బౌలర్లు క్రమశిక్షణతో రాణించి జట్టును తిరిగి మ్యాచ్‌కు చేర్చారు. సౌరభ్ 14 ఓవర్లలో 32 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, అంకిత్ రాజ్‌పుత్ రెండు వికెట్లు తీశాడు.