AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 వేలానికి ముందు తుఫాన్‌ సెంచరీ.. 57 బంతుల్లో 116 పరుగులు.. ఎవరో తెలుసా..?

IPL 2022: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 జట్లకి ఆడిన అనుభవం.. దుమ్ము దులిపేశాడు 57 బంతుల్లో 116 పరుగులు పిండేశాడు. అతడు ఎవరో కాదు ఇంగ్లాండ్‌ ఓపెనర్ జేసన్ రాయ్.

IPL 2022 వేలానికి ముందు తుఫాన్‌ సెంచరీ.. 57 బంతుల్లో 116 పరుగులు.. ఎవరో తెలుసా..?
Jason Roy
uppula Raju
|

Updated on: Feb 08, 2022 | 7:44 AM

Share

IPL 2022: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 జట్లకి ఆడిన అనుభవం.. దుమ్ము దులిపేశాడు 57 బంతుల్లో 116 పరుగులు పిండేశాడు. అతడు ఎవరో కాదు ఇంగ్లాండ్‌ ఓపెనర్ జేసన్ రాయ్. క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ఆడుతున్న ఇతడు కరాచీలోని నేషనల్ స్టేడియం పిచ్‌పై లాహోర్ క్వాలండర్స్ బౌలర్లని పరుగులు పెట్టించాడు. తుఫాను సెంచరీతో జట్టుకి విజయం అందిచాడు. ఈ మ్యాచ్‌లో జాసన్ రాయ్ 57 బంతుల్లో 203 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 116 పరుగులు చేశాడు. ఈ అసమాన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే తన సెంచరీ ఇన్నింగ్స్‌లో రాయ్ కేవలం 19 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. IPL 2022 మెగా వేలంలో జాసన్ రాయ్ బేస్ ధర రూ.2 కోట్లు. కానీ ఈ మ్యాచ్‌ తర్వాత మెగా వేలంలో అతడి విలువ పెరగవచ్చు. లాహోర్ క్వాలండర్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 204 పరుగులు చేసింది. 205 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా జట్టు 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 7 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచారు. మ్యాచ్‌ హీరో జాసన్ రాయ్ అయ్యాడు.

ఇప్పటి వరకు 18 జట్లకు ఆడాడు

ఇంగ్లండ్‌ పురుషుల క్రికెట్‌ టీమ్‌, ఐపీఎల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ లయన్స్‌ అండ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పీఎస్‌ఎల్‌కు చెందిన లాహోర్‌ క్వాలండర్స్‌, క్వెట్టా గ్లాడియేటర్స్‌, బీబీఎల్‌కు చెందిన సిడ్నీ థండర్‌, సిడ్నీ సిక్సర్స్‌తో సహా ఇప్పటివరకు 18 జట్లకు ఆడిన అనుభవం జాసన్‌రాయ్‌కు ఉంది. ఇది కాకుండా అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ రెండు జట్లు, లంక ప్రీమియర్ లీగ్ ఒక జట్టు, కొన్ని దేశీయ జట్లకు కూడా ఆడాడు.

తనకు పుట్టిన బిడ్డకి ఆ ఎమ్మెల్యే కారణం.. 2 కోట్ల పరిహారం కోరుతున్న మహిళ..

ఓలా ఎలక్ట్రిక్ పోటీగా మరో కొత్త స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 120 కిలోమీటర్ల రేంజ్‌

PM Modi: అనంతపురం రోడ్డు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన..