AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా వద్దంది.. ఐపీఎల్ ఛీకొట్టింది.. కట్‌చేస్తే.. సెంచరీతో తొడగొట్టిన బ్యాడ్‌లక్ ప్లేయర్

Buchi Babu Trophy 2025-26: పృథ్వీ షా ఇటీవల ముంబై దేశీయ జట్టును విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో అతను రంజీ ట్రోఫీ నుంచి తొలగించబడ్డాడు. ఆ తర్వాత, షా ఒక కీలక నిర్ణయం తీసుకొని మహారాష్ట్ర జట్టులో చేరాడు. మొదటి మ్యాచ్‌లోనే తన క్లాస్‌ని చూపించాడు.

టీమిండియా వద్దంది.. ఐపీఎల్ ఛీకొట్టింది.. కట్‌చేస్తే.. సెంచరీతో తొడగొట్టిన బ్యాడ్‌లక్ ప్లేయర్
Prithvi Shaw
Venkata Chari
|

Updated on: Aug 19, 2025 | 3:42 PM

Share

Prithvi Shaw Century: బీసీసీఐ వద్దని పక్క పెట్టినా.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు మాకొద్దంటూ తప్పించినా.. పృథ్వీ షా మాత్రం క్రికెట్‌లో ఎక్కడో ఒక చోట రాణించాలని కోరుకుంటూనే ఉన్నాడు. తన సత్తా చాటాలని తెగ ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే తన సొంత రాష్ట్రం ముంబైను వదిలేసిన షా.. మహారాష్ర్ట తరపున బరిలోకి దిగాడు. అయితే, ఈ మార్పు తనకు కలపి వచ్చింది. బుచ్చిబాబు ట్రోఫీలో మహారాష్ట్ర తరపున పృథ్వీ షా అద్భుతమైన సెంచరీ సాధించాడు. షా తొలిసారి మహారాష్ట్ర జట్టు తరపున ఒక మ్యాచ్ ఆడాడు. అతను తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతాలు చేశాడు. ఛత్తీస్‌గఢ్‌పై షా 111 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో షా 141 బంతులు ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 78 కంటే ఎక్కువగా ఉంది. అతను ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.

మహారాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన పృథ్వీ షా..

క్లిష్ట సమయంలో సెంచరీ చేయడం వల్ల పృథ్వీ షా ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా ఉంది. మహారాష్ట్ర జట్టు బ్యాట్స్‌మెన్ పేక మేడల్లా పడిపోతున్నప్పుడు, షా దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లను వెనక్కి నెట్టాడు. మహారాష్ట్ర కేవలం 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఐదుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లో నలుగురు 10, 4, 1, 0 మాత్రమే సాధించగలిగారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, షా దూకుడుగా బ్యాటింగ్ చేయడం ద్వారా మహారాష్ట్రను ఆటలో నిలబెట్టాడు. షా ఔట్ అయినప్పుడు, మహారాష్ట్ర స్కోరు 166 పరుగులు. అందులో అతని సహకారం 111 పరుగులు.

ముంబైని వదిలి మహారాష్ట్రలో చేరిన షా..

పృథ్వీ షా ఇటీవల ముంబై దేశీయ జట్టును విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో అతను రంజీ ట్రోఫీ నుంచి తొలగించబడ్డాడు. ఆ తర్వాత, షా ఒక కీలక నిర్ణయం తీసుకొని మహారాష్ట్ర జట్టులో చేరాడు. మొదటి మ్యాచ్‌లోనే తన క్లాస్‌ని చూపించాడు. పృథ్వీ షా పెద్ద లక్ష్యం టీమ్ ఇండియాకు తిరిగి రావడమే. అతను చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటం కొనసాగిస్తే, సెలెక్టర్లు అతన్ని మళ్ళీ ఎంపిక చేసుకోవడం తప్పనిసరి అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..