AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్‌ అన్‌సోల్డ్ ప్లేయర్లపై కన్నేసిన పాకిస్తాన్.. పీఎస్‌ఎల్‌ 2025లో బంఫర్ ఆఫర్స్

PSL 2025: "ప్లేయర్ డ్రాఫ్ట్‌ను లండన్ లేదా దుబాయ్‌లో ఉంచడానికి ఫ్రాంచైజీ యజమానులు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఇది లీగ్ బ్రాండ్ ఇమేజ్‌ను మెరుగుపరుస్తుందని వారు భావిస్తున్నారు" అని వార్తలు వినిపిస్తున్నాయి.

IPL 2025: ఐపీఎల్‌ అన్‌సోల్డ్ ప్లేయర్లపై కన్నేసిన పాకిస్తాన్.. పీఎస్‌ఎల్‌ 2025లో బంఫర్ ఆఫర్స్
Psl Vs Ipl
Venkata Chari
|

Updated on: Dec 09, 2024 | 1:55 PM

Share

IPL 2025: ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఐపీఎల్.. ఇటీవల మెగా వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది ఆటగాళ్లు లక్షాధికారులుగా మారారు. ఈ మెగా టీ20 లీగ్ వచ్చే ఏడాది సీజన్ కోసం దేశం, ప్రపంచం నలుమూలల నుంచి వందలాది మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. అయితే ఈ వేలంలో చాలా మంది కీలక ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఆటగాళ్లపై మన పొరుగు దేశం పాకిస్థాన్ కన్నేసింది.

అవును.. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేని స్టార్ ప్లేయర్లను పీఎస్‌ఎల్‌లో భాగం చేయాలని చూస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీలు ఆ ఆటగాళ్లపై పూర్తి ఆసక్తి చూపుతున్నాయి. భారతదేశంలో జరగనున్న మెగా టి 20 లీగ్ వేలంలో అమ్ముడుపోని విదేశీ స్టార్ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తమ ప్రతిభను కనబరిచేందుకు సిద్ధమయ్యారు.

ఐపీఎల్‌లో అమ్ముడుపోని ఆటగాళ్లపై పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీలు..

నివేదికల మేరకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం సమయంలో కొనుగోలుదారులను కనుగొనలేకపోయిన ఆటగాళ్లు, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీలు వారిని డ్రాఫ్ట్‌లో చేర్చాలని కోరుతున్నాయి. దీంతో వీరంతా పీఎస్‌ఎల్ 2025లో ఆడబోతున్నారు. గత నెలలో, ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిగింది. ఈ వేలంలో జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్, కేశవ్ మహరాజ్, అలెక్స్ కారీ, అకిల్ హుస్సేన్ వంటి చాలా మంది స్టార్లు అమ్ముడుపోలేదు.

ఇవి కూడా చదవండి

మరో కీలక వార్త ఏమిటంటే, వచ్చే ఏడాది జరిగే పీఎస్‌ఎల్ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డ్రాఫ్ట్‌ను విదేశాల్లో నిర్వహించవచ్చు అని తెలుస్తోంది. విదేశాల్లో జరిగే ఐపీఎల్ వేలం స్ఫూర్తితో వచ్చే ఏడాది ముసాయిదా ప్రక్రియను దుబాయ్ లేదా లండన్‌లో నిర్వహించవచ్చు అని ఓ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..