IPL 2025: 27 కోట్ల ప్రైస్ ట్యాగ్ పై ఫైర్ అయిన పంత్! నాపై కాదు గేమ్ మీద ద్రుష్టి పెట్టండి అంటూ..
రిషబ్ పంత్ ఐపీఎల్ 2025లో తన పేలవ ఫామ్పై స్పందిస్తూ, వ్యక్తిగత ప్రదర్శన కన్నా జట్టు విజయాన్ని ముఖ్యంగా భావించాలని స్పష్టం చేశాడు. జహీర్ ఖాన్ పంత్ మళ్లీ ఫామ్ను అందుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. లక్నో ప్లేఆఫ్స్ ఆశలు బతికేందుకు పంత్ నాయకత్వం కీలకమైంది. గత గాయాల నుండి కోలుకున్న పంత్, ఇప్పుడు తన సహజ ఆటతీరు చూపించాల్సిన అవసరం ఉంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో పేలవమైన ఫామ్పై లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్ తనపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించాడు. ఇప్పటివరకు తొమ్మిది ఇన్నింగ్స్లలో కేవలం 110 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, పంత్ తన వ్యక్తిగత ఫామ్ను పెద్దగా పట్టించుకోవడం లేదని వెల్లడించాడు. “ఇలాంటి సీజన్లో విషయాలు మీ అనుకూలంగా జరగకపోతే ఆటగాడిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం సహజం, అయితే అది చేయకూడదు. జట్టు ఫలితాల గురించి ఆలోచించడం ముఖ్యం. వ్యక్తిగత ప్రదర్శన గురించి కాదు,” అని పంత్ స్పష్టం చేశాడు. ఈ సీజన్లో తన బ్యాటింగ్ పొజిషన్ను మార్చి కూడా ప్రయోగాలు చేసినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. రెండు ఇన్నింగ్స్లు ఓపెనర్గా ఆడి, మిగతా వాటిలో 4వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేసినా పరుగులు రాలేదు. ఇటీవల ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బౌండరీ కొట్టి వెంటనే అవుట్ కావడం కూడా పంత్ బాధను పెంచింది.
రిషబ్ పంత్పై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన మాజీ భారత పేసర్, ప్రస్తుత LSG మెంటర్ జహీర్ ఖాన్, పంత్ ఫామ్ కోల్పోవడానికి ఐపీఎల్ తీవ్రత, ఒత్తడి కూడా కారణమని చెప్పాడు. అయితే అతను త్వరలోనే పంత్ ఫామ్ను తిరిగి పొందుతాడన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. “ఒక బ్యాటర్గా, మిడిల్ ఆర్డర్లో పంత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అతని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఏదైనా ఒక్క ఇన్నింగ్స్ క్లిక్ అవ్వాల్సిన సమస్య మాత్రమే,” అని జహీర్ వ్యాఖ్యానించాడు. అలాగే IPL 2025లో టైటిల్ గెలవడమే తమ ప్రధాన లక్ష్యమని, దానికి రిషబ్ నాయకత్వం కీలకం అని కూడా జహీర్ నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఐదు విజయాలు, ఐదు ఓటములతో సూపర్ జెయింట్స్ ఆరో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్లలో కనీసం మూడు గెలిస్తే మాత్రమే ప్లేఆఫ్స్ ఆశలు బతుకుతాయనే పరిస్థితి ఉంది. మే 4న పంజాబ్ కింగ్స్తో HPCA స్టేడియంలో తలపడనుంది. ఇప్పుడు పంత్ ఫామ్ తిరిగి పొందటం, తన నాయకత్వ నైపుణ్యాలతో జట్టును గెలుపుదిశగా నడిపించడం అత్యంత అవసరం.
రిషబ్ పంత్ గాయాల నుండి పూర్తిగా కోలుకొని తిరిగి వచ్చిన తర్వాత మొదటి సీజన్ కావడంతో, అతనిపై ఉన్న ఒత్తిడి మరింత ఎక్కువైంది. గత ఏడాది తీవ్రమైన కార్ ప్రమాదం ఎదుర్కొన్న తర్వాత పంత్ ఫిట్నెస్ సాధించడమే పెద్ద విజయంగా భావించబడింది. అయితే, ఆటగాడిగా ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం బ్యాట్తో కూడా మెరయాల్సిన అవసరం ఉందని అభిమానులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిట్నెస్ పరంగా పంత్ తన స్థిరత్వాన్ని చూపించినా, బ్యాటింగ్లో తన సహజ ధైర్యాన్ని ఇంకా కనబరిచేట్టు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచుల్లో తన నిజమైన ఆటతీరును చూపించి జట్టుకు విజయాలు అందించటమే పంత్ ముందు పెద్ద సవాలుగా నిలిచింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



