Ind vs Pak : భారత్తో మా మ్యాచ్ జరుగొద్దు.. దేవుడిని ప్రార్థిస్తున్న పాక్ క్రికెటర్లు.. అసలేం జరిగిందంటే ?
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ల మధ్య సెప్టెంబర్ 14న జరగనున్న మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఈ మ్యాచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు చేసిన బాసిత్ అలీ, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

Ind vs Pak : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న జరగనున్న మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ కీలక మ్యాచ్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను పాకిస్తాన్ జట్టు తరపున ఒక కోరిక కోరుకుంటున్నానని, టీమ్ ఇండియా ఈ మ్యాచ్ ఆడటానికి నిరాకరిస్తే బాగుంటుందని బాసిత్ అలీ వ్యాఖ్యానించారు. భారత జట్టుతో ఆడితే పాకిస్తాన్ జట్టు పరువు పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 2-1 తేడాతో ఓడిపోయింది. చివరి వన్డేలో పాకిస్తాన్ గెలవడానికి 295 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఘోర పరాజయం తర్వాత బాసిత్ అలీ ది గేమ్ ప్లాన్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. పాకిస్తాన్ జట్టుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. “ఆసియా కప్లో పాకిస్తాన్తో ఆడటానికి భారత్ నిరాకరించాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ అలా జరగకపోతే, భారత్ మమ్మల్ని దారుణంగా ఓడిస్తుంది. అది మీరు ఊహించలేరు” అని బాసిత్ అలీ అన్నారు.
ఛానల్ హోస్ట్ నవ్వుతూ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో కూడా సరిగ్గా ఆడలేదని అన్నప్పుడు, బాసిత్ అలీ ఇలా సమాధానమిచ్చారు. “ఒకవేళ మనం ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోతే, దేశంలో ఎవరూ పట్టించుకోరు. కానీ, భారత జట్టు చేతిలో ఓడిపోతే మాత్రం అందరూ పిచ్చెక్కిపోతారు.” అని అన్నారు.
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. పాకిస్తాన్ జట్టు ఇటీవల వెస్టిండీస్తో టీ20 సిరీస్ను 2-1తో గెలుచుకున్నప్పటికీ, వన్డే సిరీస్లో ఘోరంగా ఓడిపోయింది. చివరి వన్డేలో పాకిస్తాన్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. సమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సున్నా పరుగులకే ఔట్ కాగా, బాబర్ అజామ్ కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్లో పాకిస్తాన్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.
ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-2తో సమం చేసింది. ఆసియా కప్ కోసం భారత జట్టు పటిష్టంగా ఉంది. ఈ టోర్నమెంట్ను గెలవడానికి భారత్ బలమైన జట్టుగా అందరూ భావిస్తున్నారు. ఆసియా కప్లో భారత జట్టు ప్రదర్శనపై ఇప్పుడు అభిమానుల దృష్టి ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




