AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: బీసీసీఐకి షాక్.. ఐపీఎల్ ఆడొద్దంటూ స్టార్ ప్లేయర్‌కు నోటీసులిచ్చిన ఇంగ్లండ్.. ఎవరో తెలుసా?

IPL 2024 Auction: ప్రపంచ కప్ తర్వాత, ఇప్పుడు ప్రతి ఒక్కరూ IPL గురించి ఆసక్తిగా ఉన్నారు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఐపీఎల్‌ జట్లన్నీ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఐపీఎల్ వేలంలో ఎవరికి అవకాశం లభిస్తుంది? ఇలాంటి ప్రశ్నే ఎదురవుతోంది. డిసెంబర్ 19న దుబాయ్‌లో వేలం జరగనుంది. ఈ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ నుంచి షాకింగ్‌ సమాచారం వెలువడింది.

IPL 2024: బీసీసీఐకి షాక్.. ఐపీఎల్ ఆడొద్దంటూ స్టార్ ప్లేయర్‌కు నోటీసులిచ్చిన ఇంగ్లండ్.. ఎవరో తెలుసా?
Mumbai Indians Jofra
Follow us
Venkata Chari

|

Updated on: Dec 05, 2023 | 1:43 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 వేలం కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనున్న వేలం ప్రక్రియ కోసం 1166 మంది ఆటగాళ్లు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. అయితే, ఈ జాబితాలో ఇంగ్లండ్ ప్రముఖ పేసర్ జోఫ్రా ఆర్చర్ పేరు కనిపించలేదు. జోఫ్రా గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2022 వేలంలో, ఆర్చర్ ఆర్చర్‌ను ముంబై ఫ్రాంచైజీ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతను ఐపీఎల్ సీజన్ 15 ఆడలేదు. ఫిట్‌నెస్ సమస్య కారణంగా, అతను సీజన్ 16లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

ఈ కారణంగా, జోఫ్రా ఆర్చర్‌ను ఈ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. అయితే వేలంలో కనిపిస్తాడని చెప్పుకొచ్చారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సూచనల మేరకు జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.

జోఫ్రా ఆర్చర్‌ గత ఏడాది కాలంగా ఇంగ్లండ్‌ తరపున ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్, ఇప్పుడు తన పనిభారాన్ని నిర్వహించడానికి IPL నుంచి వైదొలగాలని ECB కోరింది.

ఇవి కూడా చదవండి

అంటే, ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇక్కడ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆర్చర్ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అందుకే ఈసారి ఐపీఎల్ ఆడవద్దని జోఫ్రాకు సూచించింది.

జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ 8 కోట్ల రూపాయలకు IPL 2022లో చేర్చుకుంది. ఇంగ్లండ్ క్రికెట్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ ఆడాలనుకున్నా ఆడలేడు. నిబంధనల ప్రకారం, ఓవర్సీస్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో ఆడేందుకు ప్రతి క్రీడాకారుడికి బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) అవసరం. కాబట్టి ఆర్చర్ ఐపీఎల్ ఆడలేడు.

కాగా, టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు జోఫ్రా ఆర్చర్ ముఖ్యమైన ఆటగాడిగా మారబోతున్నాడు. గాయం కారణంగా ఆర్చర్ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్‌ భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ విధంగా త్వరలో జరగనున్న టీ-20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ ‘నో ఐపీఎల్’ అనే ప్రచారాన్ని అమల్లోకి తెచ్చింది. హ్యారీ బ్రూక్‌తో పాటు ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ సహా 34 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..