AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: రోహిత్ కెరీర్‌లోనే మాయని మచ్చ.. భారత టెస్ట్ చరిత్రలోనే తొలి చెత్త కెప్టెన్‌గా

India vs New Zealand 2nd Test: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయే ఒత్తిడిలో కూరుకుపోయింది. డూ ఆర్ డై మ్యాచ్‌లోకి ప్రవేశించే ముందు, భారత జట్టు ప్లేయింగ్ XIలో 3 మార్పులు చేసింది. ఇప్పుడు పుణెలో కూడా 69 ఏళ్లుగా చేయని ఘనత దిశగా న్యూజిలాండ్ దూసుకెళ్తుండగా.. భారత జట్టు పరిస్థితి మాత్రం విషమంగా తయారైంది.

IND vs NZ: రోహిత్ కెరీర్‌లోనే మాయని మచ్చ.. భారత టెస్ట్ చరిత్రలోనే తొలి చెత్త కెప్టెన్‌గా
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Oct 26, 2024 | 10:15 AM

Share

IND vs NZ 2nd Test: బెంగుళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా ఒత్తిడిలో పడింది. డూ ఆర్ డై మ్యాచ్‌లోకి ప్రవేశించే ముందు భారత జట్టు ప్లేయింగ్ XIలో 3 మార్పులు చేసింది. ఇప్పుడు పుణెలో కూడా న్యూజిలాండ్ 69 ఏళ్లుగా చేయని ఘనత దిశగా దూసుకెళ్తుంది. దీంతో భారత జట్టు పరిస్థితి విషమంగా మారింది. రెండో టెస్టులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 3 ఏళ్ల తర్వాత టీమిండియా తరపున టెస్టు ఆడేందుకు వచ్చిన వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లకు పెవిలియన్ దారి చూపించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా న్యూజిలాండ్‌ను 259 పరుగులకే పరిమితం చేసింది. అయితే, బ్యాట్స్‌మెన్‌ విషయానికి వస్తే రోహిత్‌ అయినా, రన్‌ మెషీన్‌ కోహ్లి అయినా అందరూ రెచ్చిపోయారు. విజిటింగ్ జట్టు స్పిన్నర్లు మొత్తం జట్టును 156 పరుగులకే పరిమితం చేశారు.

రెండో రోజు కూడా ఆధిపత్యం..

రెండో రోజు న్యూజిలాండ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. కెప్టెన్ టామ్ లాథమ్ 86 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాపై మరింత భారం మోపాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు 198 పరుగుల వద్ద 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది. రోహిత్ సేన 301 పరుగుల వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓడిపోతే, న్యూజిలాండ్ సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంటుంది. కివీ జట్టు ఈ విజయంతో చరిత్ర సృష్టించనుంది.

రోహిత్ కెప్టెన్సీపై మచ్చ..

బెంగళూరు టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై దుమారం రేగింది. భారత పిచ్‌పై అత్యల్ప స్కోరు 46తో సహా అనేక అవమానకరమైన రికార్డులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో టీమిండియా ఓడిపోతే హిట్‌మెన్ కెప్టెన్సీ మరింత మసకబారుతుంది. న్యూజిలాండ్ జట్టు 1955 నుంచి భారతదేశంలో పర్యటిస్తోంది. చాలా మంది భారత కెప్టెన్లు వచ్చారు, పోయారు. కానీ, ఎప్పుడూ సిరీస్‌ను కోల్పోలేదు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోతే రోహిత్‌ కెరీర్‌లోనే ఓ మచ్చగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..