Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket World Cup: ఆఖరు ఘట్టానికి క్రికెట్‌ పండగ.. వినూత్న రితీలో శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు, ప్రజలు

దేశప్రజలంతా ముక్తకంఠంతో భారత్‌ జితేగా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇండియ టీమ్‌ గెలుపు కోసం ప్రజలు రకరకాల పూజలు, పునస్కారాలు నిర్వహిస్తూ..టీం ఇండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్‌ అభిమాని ఒకరు మినీ వరల్డ్‌కప్‌ను బంగారంతో చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు కార్వార్‌లోని నేత్రాణి ద్వీపంలో స్కూబా డైవింగ్ చేస్తూ అభిమానులు విష్ చేశారు.

Cricket World Cup: ఆఖరు ఘట్టానికి క్రికెట్‌ పండగ.. వినూత్న రితీలో శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు, ప్రజలు
World Cup
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 19, 2023 | 2:22 PM

దేశంలో ఒక్కసారిగా లాక్‌డౌన్‌ పరిస్థితి నెలకొంది…దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లు, దుకాణాలు, పార్కింగ్‌ స్థలాలు, ఆలయాలు, ప్రార్థనా స్థలాల్లో ఒకటే కేకలు, అరుపులు మిన్నంటుతున్నాయి. దేశప్రజలంతా ముక్తకంఠంతో భారత్‌ జితేగా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇండియ టీమ్‌ గెలుపు కోసం ప్రజలు రకరకాల పూజలు, పునస్కారాలు నిర్వహిస్తూ..టీం ఇండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్‌ అభిమాని ఒకరు మినీ వరల్డ్‌కప్‌ను బంగారంతో చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు కార్వార్‌లోని నేత్రాణి ద్వీపంలో స్కూబా డైవింగ్ చేస్తూ అభిమానులు విష్ చేశారు.

ఒక స్వర్ణకారుడు బంగారంతో మినీ ప్రపంచకప్‌ను చెక్కాడు. దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలోని వేనూరు కుంటడబెట్టుకి చెందిన సతీష్ ఆచార్య అనే స్వర్ణకారుడు కేవలం 50 మిల్లీగ్రాముల బరువుతో 24 క్యారెట్ల బంగారంతో ప్రపంచకప్‌ను చెక్కాడు. 916 అనేది 1.1 అంగుళాల పొడవైన బంగారు ప్రపంచ కప్ హాల్‌మార్క్ ప్రతిరూపం.

సతీష్ ఆచార్య 24 ఏళ్లుగా బంగారం పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 4 ప్రపంచకప్‌ల మినీ ప్రతిరూపాలను రూపొందించిన సతీష్ ఆచార్య 2007 T20 ప్రపంచకప్‌లో ఒక గ్రాము, 200 మిల్లీగ్రాముల బంగారాన్ని ఉపయోగించి ఈ సారి ప్రపంచకప్‌ను తయారుచేశాడు.

ఇవి కూడా చదవండి

2011లో, అతను 3 గ్రాముల వెండితో 2 అంగుళాల ఎత్తైన ప్రపంచకప్‌ను సృష్టించాడు. తరువాత, 2013లో, అతను 500 మిల్లీగ్రాముల బంగారంతో చేసిన ఒక అంగుళం పొడవైన ఛాంపియన్‌షిప్ ట్రోఫీని తయారు చేశాడు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత బంగారు ట్రోఫీని తయారు చేశాడు.

ఇదిలా ఉంటే… క్రికెట్ అభిమానులు కొందరు సముద్రపు లోతుల్లో కూడా భారత క్రికెట్ జట్టు గెలిచి భారత్  సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షించారు. మురుడేశ్వర్‌లోని నేత్రాని ద్వీపంలో స్కూబా డైవింగ్ చేస్తూ భారత జట్టుకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

మురుడేశ్వర్‌లోని నేత్రాణి అడ్వెంచర్స్‌కు చెందిన నిపుణులైన డైవర్లు అనీష్, నవీన్, లోకి టీమ్ ఇండియాను అభినందించారు. సముద్రం అడుగున ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా అంటూ పోస్టర్ పట్టుకుని విష్ చేశాడు. భారత్ ప్రపంచకప్ గెలుస్తుందన్న ధీమాతో నేత్రాణి అడ్వెంచర్స్ ప్రజలకు ఒక వారం పాటు కేవలం రూ.1999కే ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. స్కూబా డైవింగ్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రపంచకప్ నేపథ్యంలో నేత్రాణి అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ రేట్లను సగానికి తగ్గించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్‌కప్‌ వార్‌ మొదలైంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా సారథి పాట్ కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేపట్టింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…