AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఐర్లాండ్‌పై పరువుపోకుండా ఉండాలంటే.. ఈ 3 తప్పులు రిపీటవ్వొద్దు శ్రేయాస్..!

Shreyas Iyer Captaincy Mistakes: ఐర్లాండ్ వంటి జట్టుపై సిరీస్ కోల్పోతే అది టీమిండియా ప్రతిష్టకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఆదివారం జరగబోయే రెండో టీ20 మ్యాచ్ భారత్‌కు జీవన్మరణ సమస్య లాంటిది. యువ ఆటగాడు వైభవ్‌కు అవకాశం ఇవ్వడంతో పాటు, డెత్ ఓవర్ల బౌలింగ్‌ను మెరుగుపరుచుకుని కెప్టెన్ అయ్యర్ చాకచక్యంగా వ్యవహరిస్తేనే భారత్ ఈ సిరీస్‌ను సమం చేసి పరువు నిలబెట్టుకోగలదు.

Team India: ఐర్లాండ్‌పై పరువుపోకుండా ఉండాలంటే.. ఈ 3 తప్పులు రిపీటవ్వొద్దు శ్రేయాస్..!
India Vs Ireland 2026
Venkata Chari
|

Updated on: Jun 28, 2026 | 9:00 AM

Share

India vs Ireland 2026: భారత క్రికెట్ అభిమానులకు జూన్ 26 రాత్రి ఒక పీడకలలా మిగిలిపోయింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో టీమిండియాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. జూన్ 28న జరగబోయే ఆఖరి, నిర్ణయాత్మక పోరులో గెలిచి సిరీస్ కాపాడుకోవాలంటే భారత్ తక్షణమే కొన్ని కీలక తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంది.

చేతులెత్తేసిన బ్యాటర్లు.. ఒంటరి పోరాటం చేసిన అభిషేక్..

ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన భారత్, ప్రత్యర్థిని 30 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి మంచి పట్టు సాధించింది. కానీ ఆ తర్వాత బౌలర్లు చేతులెత్తేయడంతో ఐర్లాండ్ ఏకంగా 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ 49 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమై నిరాశపరిచారు. ఫలితంగా భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో టీమిండియా సరిదిద్దుకోవాల్సిన 3 ప్రధాన లోపాలు ఇవే:

1. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోకపోవడం..

ఐపీఎల్ 2026 సీజన్‌లో సంచలన బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టించిన 15 ఏళ్ల యువ కిరణం వైభవ్ సూర్యవంశీని తొలి మ్యాచ్‌లో పక్కన పెట్టడం మేనేజ్‌మెంట్ చేసిన అతిపెద్ద తప్పు. అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడటానికి అతనికి ఇంకా సమయం కావాలని జట్టు యాజమాన్యం భావించినప్పటికీ, ప్రస్తుతం అతను ఉన్న సూపర్‌ ఫామ్‌ను వాడుకోకపోవడం గమనార్హం. ఇటీవలే శ్రీలంకలో జరిగిన త్రైపాక్షిక సిరీస్ ఫైనల్లో ఇండియా-ఎ తరపున వైభవ్ 94 పరుగులతో విరుచుకుపడ్డాడు. రెండో టీ20లో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించితే పవర్‌ప్లేలో పరుగుల వరద పారడం ఖాయం.

2. డెత్ ఓవర్ల బౌలింగ్‌లో వైఫల్యం..

తొలి మ్యాచ్‌లో భారత ఓటమికి ప్రధాన కారణం ఇన్నింగ్స్ ముగింపు దశలో ఘోరంగా పరుగులు సమర్పించుకోవడమే. ముఖ్యంగా 17వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 27 పరుగులు ఇచ్చుకుని మ్యాచ్‌ను ఐర్లాండ్ వైపు తిప్పేసాడు. అతను నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 57 పరుగులు లీక్ చేశాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల ప్రిన్స్ యాదవ్‌ను తదుపరి మ్యాచ్‌లో ప్రసిద్ధ్ స్థానంలో తీసుకోవడం జట్టుకు ఎంతో ప్రయోజనకరం.

3. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యూహాత్మక లోపాలు..

పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడిన శ్రేయస్ అయ్యర్ మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. క్రీజులో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్‌కు 16వ ఓవర్ ఇవ్వడం పెద్ద మైనస్ అయింది. ఆ ఓవర్లో సుందర్ 19 పరుగులు ఇచ్చాడు. మరోవైపు 3 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసిన శివం దూబే చేత ఆఖరి ఓవర్లు వేయించకుండా పక్కన పెట్టడం అయ్యర్ చేసిన వ్యూహాత్మక తప్పిదంగా నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐర్లాండ్‌పై పరువుపోకుండా ఉండాలంటే.. ఈ 3 తప్పులు మారాల్సిందే..?
ఐర్లాండ్‌పై పరువుపోకుండా ఉండాలంటే.. ఈ 3 తప్పులు మారాల్సిందే..?
ఆ చీమ గుడ్ల కూర కోసం ఎగబడుతున్న జనాలు.. గిరిజనుల హెల్త్ సీక్రెట్
ఆ చీమ గుడ్ల కూర కోసం ఎగబడుతున్న జనాలు.. గిరిజనుల హెల్త్ సీక్రెట్
నాగుపాములతో ఒకే ఇంట్లో కాపురం..భారతదేశంలోని ఈ వింత గ్రామం చూశారా?
నాగుపాములతో ఒకే ఇంట్లో కాపురం..భారతదేశంలోని ఈ వింత గ్రామం చూశారా?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
నువ్వు లేకపోతే చచ్చిపోతా అని.. తర్వాత టార్చర్ చేశాడు..
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే