AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Indians : బుమ్రా కెప్టెన్సీలో టీమ్ జోష్ మామూలుగా లేదుగా.. హార్దిక్ లేకపోవడమే కలిసొచ్చిందా?

Mumbai Indians : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై మాజీ సెలెక్టర్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ లేకపోవడంతో బుమ్రా సారధ్యంలో జట్టు ఐక్యంగా, సంతోషంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ మార్పు ముంబై క్యాంప్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mumbai Indians : బుమ్రా కెప్టెన్సీలో టీమ్ జోష్ మామూలుగా లేదుగా.. హార్దిక్ లేకపోవడమే కలిసొచ్చిందా?
Bumrah
Rakesh
|

Updated on: May 15, 2026 | 1:49 PM

Share

Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ (75 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. అయితే ఈ విజయం కంటే కూడా టీమ్ బాడీ లాంగ్వేజ్, జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరం కావడంతో, బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ మార్పు ముంబై క్యాంప్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హార్దిక్ పాండ్యాకు ఏమైంది?

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా గత మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, మెడికల్ టీమ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో అతను జట్టుతో కలిసి ధర్మశాల ప్రయాణం చేయలేదు. హార్దిక్ గైర్హాజరీలో, సూర్యకుమార్ యాదవ్ కూడా వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రా భుజాన పడ్డాయి. అయితే బుమ్రా నేతృత్వంలో జట్టు ఆడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

బుమ్రా కెప్టెన్సీపై చీఫ్ సెలెక్టర్ ప్రశంసలు

టీమిండియా మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ముంబై విజయంపై స్పందించారు. “బుమ్రాను కెప్టెన్ చేయడం మేనేజ్‌మెంట్ తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. మైదానంలో ఆటగాళ్లందరూ చాలా సంతోషంగా, ఐకమత్యంగా కనిపించారు. జట్టులో ఏదో సమస్య ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది, కానీ బుమ్రా కెప్టెన్సీలో టీమ్ మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. బుమ్రా నిరంతరం చిరునవ్వుతో బౌలర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు” అని శ్రీకాంత్ విశ్లేషించారు. ధోనీ నాయకత్వాన్ని ఎంతగానో ఇష్టపడే శ్రీకాంత్.. ఇప్పుడు బుమ్రాలో కూడా అలాంటి శాంత స్వభావాన్ని చూస్తున్నానని చెప్పారు.

సమిష్టి కృషితోనే విజయం

ఈ మ్యాచ్‌లో కేవలం తిలక్ వర్మ మాత్రమే కాదు, బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ నాలుగు కీలక వికెట్లు తీసి పంజాబ్ నడ్డి విరిచాడు. దీపక్ చాహర్, రాజ్ అంగద్ బావా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ముంబై జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ, గెలవాలనే కసి ఆటగాళ్లలో స్పష్టంగా కనిపించింది. బుమ్రా బాడీ లాంగ్వేజ్ జట్టు మొత్తానికి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిందని, అందుకే ముంబై మళ్ళీ పుంజుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై తన తదుపరి మ్యాచ్‌ను మే 20న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us