India Vs South Africa: పట్టుబిగించిన టీమిండియా.. సఫారీల టార్గెట్ 305

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్(34), కెఎల్ రాహుల్(23)...

India Vs South Africa: పట్టుబిగించిన టీమిండియా.. సఫారీల టార్గెట్ 305
Ind Vs Sa
Follow us

|

Updated on: Dec 29, 2021 | 6:15 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్(34), కెఎల్ రాహుల్(23), రహనే(18) పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవ్వరూ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, జాన్సెన్ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. ఎనిగిడి 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌‌తో కలిపి భారత్‌కు 304 పరుగుల ఆధిక్యం దక్కింది. దీనితో ఈ మ్యాచ్‌లో గెలవాలంటే సఫారీలు 305 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్‌ 10 వికెట్లు పడగొట్టాలి.

అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియాను ఎనిగిడి 6 వికెట్లు తీసి.. రబాడా 3 వికెట్లు తీసి వెన్ను విరిచాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌‌లో సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 197 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమి 5 వికెట్లు, శార్దుల్‌ 2 వికెట్లు, బుమ్రా, సిరాజ్‌, చెరో వికెట్ పడగొట్టారు.