AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CLT20: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 10 ఏళ్ల తర్వాత ఢీ కొట్టనున్న IPL vs PSL ఆటగాళ్లు.. బీసీసీఐ భారీ స్కెచ్?

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లోని టాప్-3 జట్లతో సహా ప్రపంచంలోని ప్రధాన లీగ్‌లలో విజేతగా నిలిచిన జట్ల మధ్య ఛాంపియన్స్ లీగ్ T20 టోర్నమెంట్‌ను నిర్వహించాలని BCCI యోచిస్తోంది. ఈ ప్లాన్ విజయవంతమైతే, IPL 2024 ముగిసిన తర్వాత క్రికెట్ ప్రేమికులు మరో రంగుల టోర్నమెంట్‌ని చూసే అవకాశం లభిస్తుంది.

CLT20: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 10 ఏళ్ల తర్వాత ఢీ కొట్టనున్న IPL vs PSL ఆటగాళ్లు.. బీసీసీఐ భారీ స్కెచ్?
Champions League T20
Venkata Chari
|

Updated on: Apr 03, 2024 | 1:50 PM

Share

Champions League T20: ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) టోర్నమెంట్‌ను తిరిగి నిర్వహించేందుకు BCCI తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించింది. టోర్నమెంట్ చివరిసారిగా 2014లో ప్రపంచ మేజర్ లీగ్‌లలోని ఛాంపియన్స్ జట్ల మధ్య జరిగింది. ఆ తర్వాత బీసీసీఐ ప్రపంచ ఛాంపియన్ జట్లను తిరిగి కలపలేకపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. దీనిపై బీసీసీఐ ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు)తో చర్చించింది. ఈ చర్చలు సఫలమైతే ఈ ఏడాది ఛాంపియన్స్ లీగ్ టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది.

ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో ప్రపంచంలోనే అగ్రగామి లీగ్ జట్లు తలపడనున్నాయి. మునుపటి ఎడిషన్లలో, IPL నుంచి మూడు జట్లు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లీగ్ నుంచి రెండు జట్లు, పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుంచి T20 లీగ్ ఛాంపియన్లు పోటీలో ఉన్నాయి.

ఇప్పుడు ఫ్రాంచైజీ లీగ్‌లోని ఛాంపియన్ జట్లను మరోసారి ఏకం చేసి ఛాంపియన్స్ టీ20 టోర్నమెంట్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. కానీ, ప్రస్తుత క్రికెట్ క్యాలెండర్ బిజీగా ఉన్నందున, ఈ టోర్నమెంట్‌కు సమయం దొరకడం బీసీసీఐకి అతిపెద్ద సవాలుగా మారనుంది.

ఇవి కూడా చదవండి

అందువల్ల, BCCI ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చించింది. ఈ రెండు క్రికెట్ బోర్డులు తమ జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చినట్లయితే, ఛాంపియన్స్ T20 లీగ్‌కు విండో తెరవబడుతుంది. అందువల్ల రానున్న రోజుల్లో ఈ చర్చలు సఫలమైతే నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఛాంపియన్ జట్ల ఛాంపియన్స్ టీ20 లీగ్ నిర్వహించే అవకాశం ఉంది.

ఛాంపియన్స్ T20 టోర్నమెంట్ 2009-10 నుంచి 2014-15 మధ్య 6 సార్లు నిర్వహించారు. నాలుగు సార్లు భారత్‌లో టోర్నీ జరగ్గా, 2 సార్లు దక్షిణాఫ్రికాలో టోర్నీ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో రెండుసార్లు గెలుపొందాయి. ఆస్ట్రేలియాకు చెందిన న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్స్ ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..