AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2025: గతంలో బుసలు కొట్టి ఇప్పుడు తుస్సుమనిపించిన ఐదుగురు స్టార్ ప్లేయర్స్

2025 ఐపీఎల్ వేలంలో కొంత మంది ప్రముఖ ఆటగాళ్లు గత సెజన్లతో పోల్చితే తక్కువ ధరకు అమ్ముడుపోయారు. కేఎల్ రాహుల్, లియామ్ లివింగ్‌స్టోన్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్ల ధర తగ్గినా, వారు తమ అనుభవం, ప్రదర్శనతో కొత్త జట్లకు కీలకంగా మారవచ్చు. వీరి ప్రదర్శనకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

IPL Auction 2025: గతంలో బుసలు కొట్టి ఇప్పుడు తుస్సుమనిపించిన ఐదుగురు స్టార్ ప్లేయర్స్
Kl Rahul Ishan Kishan
Narsimha
|

Updated on: Nov 25, 2024 | 12:40 PM

Share

ఐపీఎల్ మెగా వేలం మొదటి రోజు కొంత మంది స్టార్ట్ ప్లేయర్లు రికార్డు ధరకు అమ్ముడుపోగా కొంత మంది మాత్రం వేలంలో మాత్రం అనుకున్నంత ధరను దక్కించుకోలేదు. గతంలో వేలంలో తమ సత్తా చాటిన ఇప్పుడు మాత్రం మమ అనిపించారు.

కేఎల్ రాహుల్

గతంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ₹14 కోట్లకు అమ్ముడయ్యాడు. ఇది గత వేలంలో అతని ₹17 కోట్ల ధర కంటే గణనీయంగా తక్కువ. రాహుల్ గాయాల కారణంగా గత సీజన్‌లో పరిమిత ప్రదర్శన మాత్రమే చేయగలిగినా అతని బ్యాటింగ్ అనుభవం, సీనియర్ పాత్ర కొత్త జట్టుకు కీలకంగా మారవచ్చు​.

లియామ్ లివింగ్‌స్టోన్

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన లివింగ్‌స్టోన్, 2025లో ₹8.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చేరాడు. గతంలో అతని ధర ₹11.5 కోట్లుగా ఉంది. అతని ఆల్‌రౌండ్ సామర్థ్యాలు అయినప్పటికీ, పేలవ ప్రదర్శనలు, గాయాల బెడద అతని ధర తగ్గింపుకు కారణమయ్యాయి​.

గ్లెన్ మాక్స్‌వెల్

గతంలో ₹11 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆడిన మాక్స్‌వెల్, ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టుకు అనూహ్య రీతిలో ₹4.2 కోట్లకు కొనుగోలు అయ్యాడు. ఇది అతని గత ధర పోలిస్తే చాలా తక్కువ. ఫార్మ్ కోల్పోవడం, బ్యాటర్, బౌలర్ గ విఫలమవడం ఈ సీనియర్ ఆస్ట్రేలియా అతగాడి ధర తగ్గింపుకు దోహదపడింది​.

రాహుల్ త్రిపాఠి

ఒక నిలకడైన మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మెరిసిన త్రిపాఠి, తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ₹3.5 కోట్లకు చేరాడు. గత సీజన్‌లో అతని ధర ₹8 కోట్లుగా ఉండేది. త్రిపాఠి తన దూకుడు బ్యాటింగ్ శైలిని కొనసాగిస్తే, అతను తన విలువను మళ్ళీ పొందగలడు. ​

ఇషాన్ కిషన్

మునుపటి ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్, మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్, ఈసారి ₹11. కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరాడు, ఇది అతని గత ధర ₹15.25 కోట్లతో పోలిస్తే తక్కువ. అతని ప్రదర్శన గత సీజన్‌లో అంత ప్రభావం చూపలేకపోవడమే తక్కువ ధరకు అమ్ముడవడం కారణమవచ్చు. అయినప్పటికీ, అతని వికెట్ కీపింగ్, దూకుడు బ్యాటింగ్ కొత్త ఫ్రాంచైజీకీ విలువైన ఆటగాడిగా మారవచ్చు.

2025 ఐపీఎల్ వేలంలో కొందరు ప్రముఖ ఆటగాళ్లు గత సీజన్లతో పోల్చితే తక్కువ ధరకు కొనుగోలు అయినప్పటికీ, వారి అనుభవం, ప్రదర్శన స్ఫూర్తితో వారు తమ కొత్త ఫ్రాంచైజీలకు కీలక ఆటగాళ్లుగా నిలవగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ ఆటగాళ్లు తమ కొత్త ఫ్రాంచైజీలతో మరింత మెరుగైన ప్రదర్శన చేసి, తమ విలువను తిరిగి పొందగలరా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.