AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : రుతురాజ్ కెప్టెన్సీకి ముప్పు.. సంజూ శాంసన్ సీఎస్‌కేలో చేరితే ఏం జరుగుతుంది ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానుల మధ్య ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక పెద్ద ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ డీల్‌లో ముగ్గురు కీలక ప్లేయర్లు రవీంద్ర జడేజ, సామ్ కరన్, సంజూ శాంసన్ భాగం కావచ్చు.

IPL 2026 : రుతురాజ్ కెప్టెన్సీకి ముప్పు.. సంజూ శాంసన్ సీఎస్‌కేలో చేరితే ఏం జరుగుతుంది ?
Ravindra Jadeja
Rakesh
|

Updated on: Nov 13, 2025 | 9:31 AM

Share

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానుల మధ్య ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక పెద్ద ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ డీల్‌లో ముగ్గురు కీలక ప్లేయర్లు రవీంద్ర జడేజ, సామ్ కరన్, సంజూ శాంసన్ భాగం కావచ్చు. ఒకవేళ ఈ డీల్ ఫైనల్ అయితే, జడేజా, సామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో కనిపించవచ్చు. అయితే సంజూ శాంసన్ సీఎస్‌కేలో చేరవచ్చు. ఈ ఊహాగానాలు ఐపీఎల్ మార్కెట్‌లో పెద్ద అలజడిని సృష్టిస్తున్నాయి.

రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్‌కు ఒక స్పష్టమైన షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అతనికి కెప్టెన్సీ అప్పగిస్తేనే జట్టులో చేరతానని చెప్పినట్లు సమాచారం. 37 ఏళ్ల జడేజా తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. ఒక జట్టుకు నాయకత్వం వహించి ట్రోఫీని గెలిపించాలని కలలు కంటున్నాడు. రాజస్థాన్ మేనేజ్‌మెంట్ ప్రస్తుతం ఈ షరతుపై తీవ్రంగా ఆలోచిస్తోంది. జట్టు ముందుగా యశస్వి జైస్వాల్ లేదా రియాన్ పరాగ్‎లను భవిష్యత్ కెప్టెన్‌లుగా సిద్ధం చేయాలని భావించింది. అయితే, జడేజా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఫ్రాంఛైజీ వైఖరి మారే అవకాశం ఉంది. ఇది రాజస్థాన్ జట్టుకు ఒక పెద్ద నిర్ణయం కానుంది.

ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ పూర్తయితే, సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం దాదాపు ఖాయం అని భావిస్తున్నారు. సంజూ బ్యాటింగ్ నైపుణ్యం, లీడర్ షిప్ క్వాలిటీస్ సీఎస్‌కేకు పెద్ద లాభం చేకూర్చవచ్చు. అయితే, ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నాడు. భవిష్యత్ కెప్టెన్‌గా ఫ్రాంఛైజీ అతన్ని ప్రకటించింది. సంజూ రాకతో జట్టు టాప్ ఆర్డర్ మరింత బలంగా మారుతుంది, కానీ భవిష్యత్తులో అతను కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడా లేదా అనేది చూడాలి.

రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సుదీర్ఘ కాలంగా బంధం ఉంది. 2012లో జట్టులో చేరిన తర్వాత అతను అనేక అద్భుత ప్రదర్శనలు చేసి, రెండుసార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, 2022లో ధోని కెప్టెన్సీని విడిచిపెట్టి జడేజాకు అప్పగించినప్పుడు, జట్టు ప్రదర్శన క్షీణించింది. ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచిన తర్వాత జడేజా కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత ధోని తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టును విజయపథంలో నడిపించాడు.

ఐపీఎల్ 2026 వేలంకు ముందే ఈ ట్రేడ్ డీల్ గురించి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ జడేజా రాజస్థాన్‌కు వెళ్లి, శాంసన్ చెన్నైలో చేరితే, ఇది టోర్నమెంట్‌లో అతిపెద్ద ట్రేడ్‌లలో ఒకటిగా నిరూపితం కావచ్చు. రెండు జట్ల అభిమానులు ఇప్పుడు ఈ కెప్టెన్ ఎక్స్ఛేంజ్ పై బీసీసీఐ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..