IPL 2025: CSK అభిమానులకు చెన్నై స్పెషల్ గిఫ్ట్! ఆ మ్యాచ్ లకి ఉచితంగా టికెట్స్!
చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ మ్యాచ్లకు హాజరయ్యే అభిమానుల కోసం చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), MTC ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పిస్తున్నాయి. మ్యాచ్ టిక్కెట్ కలిగిన వీక్షకులు మెట్రో రైలు, ఎంటీసీ బస్సుల సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం మ్యాచ్ జరిగే రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ట్రాఫిక్ తగ్గించడంతో పాటు, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచేందుకు సహాయపడుతుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ను మరింత సులభతరం చేసేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (MTC) ప్రత్యేకంగా ఐపీఎల్ వీక్షకుల కోసం ప్రత్యేక ప్రయాణ సదుపాయాలను కల్పిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హోమ్ మ్యాచ్లకు హాజరయ్యే అభిమానుల కోసం ఉచిత మెట్రో రైలు, బస్సు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఐపీఎల్ 2025లో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న మ్యాచ్లకు టిక్కెట్ కలిగిన వీక్షకులు మెట్రో రైలు సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. వీరు తమ సమీప మెట్రో స్టేషన్ నుండి గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఎలాంటి చార్జీలు పెట్టనవసరం లేదు.
ఈ సదుపాయం మ్యాచ్ జరిగే రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత 90 నిమిషాల పాటు లేదా అర్థరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికుల డిమాండ్ను బట్టి, కొన్ని సందర్భాల్లో మెట్రో రైలు చివరి సర్వీస్ సమయాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది.
కేవలం మెట్రో రైలు మాత్రమే కాకుండా, చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (MTC) కూడా ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేక బస్సు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ ప్రకటన ప్రకారం, CSK హోమ్ మ్యాచ్కు హాజరయ్యే అభిమానులు తమ క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ను చూపించి ఎంటీసీ నాన్-ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఈ ఉచిత బస్సు సేవలు మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచే అందుబాటులో ఉంటాయి. గత ఏడాది చెన్నైలో జరిగిన IPL మ్యాచ్లకు దాదాపు 8,000 మంది వరకు ఎంటీసీ బస్సుల సేవలను ఉపయోగించుకున్నారని విశ్వనాథన్ తెలిపారు.
CSK మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ, “మా అభిమానులకు ఉత్తమ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో మెట్రో, MTCతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. చెన్నైలోని క్రికెట్ అభిమానులు తమ ఇళ్ల నుంచి బయలుదేరిన క్షణం నుండే ఐపీఎల్ ఉత్సాహాన్ని పూర్తిగా ఆస్వాదించగలిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం” అని తెలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్-MTC ఈ ప్రణాళికను అమలు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం, అభిమానులను మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణా సేవలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడం. 2024 సీజన్లో, ప్రతి CSK హోమ్ మ్యాచ్కు సుమారు 8,000 మంది వరకు ఉచిత బస్సు సేవలను ఉపయోగించుకున్నారు. ఇది ప్రజా రవాణా ఉపయోగాన్ని పెంచడంతో పాటు, ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
CMRL Partners with CSK to Enhance Metro Services for IPL 2025
Chennai Metro Rail Limited (CMRL) is pleased to announce its collaboration with Chennai Super Kings Cricket Limited (CSKCL) to provide seamless and hassle-free travel for cricket fans attending the IPL 2025 matches… pic.twitter.com/52onlssEay
— Chennai Metro Rail (@cmrlofficial) March 15, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..