AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 Auction: తొలిసారి విదేశాల్లో ఐపీఎల్ వేలం.. లక్ చెక్ చేసుకోనున్న 1166 మంది ప్లేయర్లు.. ఎప్పుడంటే?

వేలంలో 25 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.2 కోట్లు కాగా, అందులో ఆస్ట్రేలియా నుంచి ఏడుగురు, భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్‌ల ప్రాథమిక ధర రూ.2 కోట్లుగా నిలిచింది. హర్షల్ పటేల్, కేదార్ జాదవ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ భారతీయులలో అత్యధిక మూల ధరలను కలిగి ఉన్నారు.

IPL 2024 Auction: తొలిసారి విదేశాల్లో ఐపీఎల్ వేలం.. లక్ చెక్ చేసుకోనున్న 1166 మంది ప్లేయర్లు.. ఎప్పుడంటే?
ఈ ఐదుగురు ప్లేయర్స్ లిస్టులో వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ ముందున్నాడు. ఫైనల్‌లో భారీ సెంచరీతో ట్రోఫీని టీమిండియా నుంచి లాక్కున్న హెడ్.. ఫార్మాట్ ఏదైనా కూడా పరుగుల వరద పారిస్తాడు. ఇక అతడి దూకుడైన ఆటతీరే.. ఫ్రాంచైజీలను ఆకట్టుకుంది. ఇతడి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య పెద్ద వార్ జరగొచ్చు.
Venkata Chari
|

Updated on: Dec 03, 2023 | 7:21 PM

Share

IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. దేశం వెలుపల ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు జట్లకు రూ.5 కోట్లు అధికంగా ఉండనున్నాయి.

గత సీజన్‌లో ఫ్రాంచైజీ జట్టు కోసం 95 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈసారి జట్టును సిద్ధం చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా, జట్లు మునుపటి సీజన్‌లో అంటే 2023లో మిగిలిన మొత్తాన్ని కూడా కలిగి ఉంటాయి.

ఐపీఎల్ వేలానికి 1166 మంది ఆటగాళ్లు..

1166 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 830 మంది భారతీయులు, 336 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ విదేశీ ఆటగాళ్లలో తన పేరు చేర్చలేదు.

మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, గెరాల్డ్ కూటీస్, రచిన్ రవీంద్ర వంటి పెద్ద విదేశీ ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. భారత ఆటగాళ్లలో హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరి ధర రూ.10 కోట్లకు మించి ఉంటుంది.

టోర్నమెంట్‌లో పాల్గొనే 10 జట్లు గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అందులో 30 మంది విదేశీయులు ఉండనున్నారు. టీమ్‌ల వద్ద రూ. 262.95 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈసారి ఒక్కో జట్టు పర్స్ రూ. 100 కోట్లుగా నిలిచింది.

25 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.2 కోట్లు..

వేలంలో 25 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.2 కోట్లు కాగా, అందులో ఆస్ట్రేలియా నుంచి ఏడుగురు, భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్‌ల ప్రాథమిక ధర రూ.2 కోట్లుగా నిలిచింది. హర్షల్ పటేల్, కేదార్ జాదవ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ భారతీయులలో అత్యధిక మూల ధరలను కలిగి ఉన్నారు.

వీరితో పాటు 20 మంది ఆటగాళ్ల వేలం రూ.1.50 కోట్లతో ప్రారంభం కానుండగా, 16 మంది ఆటగాళ్ల వేలం కోటి రూపాయలతో ప్రారంభమవుతుంది. మిగిలిన 1105 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.20 నుంచి 95 లక్షల మధ్య ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..