Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: అప్పుడు నెట్ బౌలర్లు.. ఇప్పుడు మ్యాచ్ విన్నర్స్.. లిస్టులో ధోని, కోహ్లీ టీమ్‌మేట్స్.. ఎవరో తెలుసా?

ఐపీఎల్ 2023 మినీ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వీరిలో కేవలం 80 మందిని మాత్రమే..

IPL 2023: అప్పుడు నెట్ బౌలర్లు.. ఇప్పుడు మ్యాచ్ విన్నర్స్.. లిస్టులో ధోని, కోహ్లీ టీమ్‌మేట్స్.. ఎవరో తెలుసా?
ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. ఈ పాటికే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తమ తమ జట్లను సిద్ధం చేసుకోవడమే కాక వాటిని నడిపించే సారథులను కూడా ఎన్నుకున్నాయి. అయితే ఐపీఎల్ 15వ సీజన్ టోర్నీలో కోల్‌కతా నైత్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు లీగ్ దూరంగా ఉండనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన అతని స్థానంలో జట్టులోని నితిష్ రాణాను కెప్టెన్‌గా నియమించింది టీమ్ ఫ్రాంచైజీ. మరి ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీలో ఏ టీమ్‌ను ఏ సారథి నడిపిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 27, 2022 | 8:06 AM

ఐపీఎల్ 2023 మినీ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. వీరిలో కేవలం 80 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. మిగిలిన 325 మంది ప్లేయర్స్‌కు అదృష్టం వరించలేదు. అయితే ఇక్కడ కొంతమంది యువ ఆటగాళ్లు మాత్రం నక్కతోక తొక్కారు. గత సీజన్‌లో నెట్ బౌలర్లుగా అవకాశం దక్కించుకున్న వాళ్లు.. ఈసారి మినీ వేలంలో కోట్లు పలకడం విశేషం. మరి ఆ లక్కీ నెట్ బౌలర్లు ఎవరో చూసేద్దాం పదండి..

  • జాషువా లిటిల్:

ఈ ఐర్లాండ్ యువ లెఫ్టార్మ్ పేసర్ ఐపీఎల్ 15వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున నెట్ బౌలర్‌గా ఎంపిక అయ్యాడు. ఇక ఇప్పుడు మినీ వేలంలో జాషువా లిటిల్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 4.40 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.

  • కుల్వంత్ ఖేజ్రోలియా:

గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు కుల్వంత్ ఖేజ్రోలియా నెట్‌ బౌలర్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు అతడ్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ మినీ వేలంలో రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది.

  • మోహిత్ శర్మ:

గత సీజన్‌లో ఈ టీమిండియా పేసర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే, ఆ తర్వాత ఐపీఎల్‌ 15వ సీజన్‌కు గుజరాత్ టైటాన్స్ తరపున నెట్ బౌలర్‌గా ఆడాడు. విశేషమేమిటంటే ఈసారి మోహిత్ శర్మను గుజరాత్ టైటాన్స్ రూ.50 లక్షలకు మినీ వేలంలో దక్కించుకుంది.

  • ముఖేష్ కుమార్:

ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నెట్ బౌలర్‌గా ఉన్న ముఖేష్ కుమార్‌కు ఈసారి అదృష్టం వరించింది. మొత్తం రూ. 5.75 కోట్లతో ముఖేష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీనే కొనుగోలు చేయడం విశేషం.

  • నిషాంత్ సింధు:

ఐపీఎల్ చివరి సీజన్‌లో సీఎస్‌కే తరపున నెట్ బౌలర్‌గా కనిపించిన నిషాంత్ సింధును ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బౌలర్‌గా తీసుకుంది. రూ. 60 లక్షలతో ఈ యువ ఆటగాడిని సీఎస్‌కే సొంతం చేసుకుంది.