AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఎంఎస్ ధోనీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన అభిమానులు.. గిఫ్ట్ చూసి షాకైన చెన్నై సారథి.. ఏంటంటే?

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎంఎస్ ధోని జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ సీజన్‌లో చివరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులకు వీడ్కోలు చెప్పేందుకు మైదానం చుట్టూ తిరుగుతూ బై బై చెప్పేశారు.

Video: ఎంఎస్ ధోనీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన అభిమానులు.. గిఫ్ట్ చూసి షాకైన చెన్నై సారథి.. ఏంటంటే?
MS Dhoni
Venkata Chari
|

Updated on: May 19, 2023 | 8:25 PM

Share

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎంఎస్ ధోని జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ సీజన్‌లో చివరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ కూడా ఆడింది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులకు వీడ్కోలు చెప్పేందుకు మైదానం చుట్టూ తిరుగుతూ బై బై చెప్పేశారు. నిజానికి చెపాక్ స్టేడియంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. చెపాక్ స్టేడియం చాలా ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు హోమ్ గ్రౌండ్. ధోనీ టీమ్‌కు ఇక్కడి అభిమానుల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఓ ఇంటర్వ్యూలో ధోనీ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలో ఆడాలనుకుంటున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌లో చివరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఆడిన ధోనీకి కొంతమంది అభిమానులు చెపాక్ స్టేడియం రూపంతో చిన్న ఫొటోను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ధోనీతోపాటు ఆ అభిమాని కలిసి ఉన్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ధోనీకి ఎంఏ చిదంబరం స్టేడియం అంటే చెపాక్ స్టేడియం నమూనాను అందించారు. ఈ బహుమతి చూసి ధోనీ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

చివరి లీగ్ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం..

ఐపీఎల్‌లో చెన్నై ఆటతీరును పరిశీలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్‌కు టిక్కెట్ దక్కలేదు. గురువారం విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం చెన్నై, లక్నో జట్లకు అనివార్యంగా మారింది.

చెన్నై, లక్నో జట్లకు 15 పాయింట్లు ఉన్నాయి. బెంగళూరు ఇప్పుడు 14 పాయింట్లతో ఉంది. ముంబైకి కూడా 14 పాయింట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌కు 12 పాయింట్లు ఉన్నాయి. తద్వారా శుక్రవారం జరిగే లీగ్ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే 14 పాయింట్లు అందుకోవచ్చు. దీంతో నెట్ రన్ రేట్ కూడా ప్లస్ అవుతుంది. అయితే, బెంగళూరు, చెన్నై, లక్నో తమ మిగిలిన చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే, ప్లే-ఆఫ్స్‌కు నేరుగా టిక్కెట్ పొందే ఛాన్స్ ఉంది. ఒకవేళ చివరి మ్యాచ్‌లో ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్‌కు దూరమవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సోనీ నుంచి సరికొత్త ఫీచర్లతో థియేటర్ ఉత్పత్తులు
సోనీ నుంచి సరికొత్త ఫీచర్లతో థియేటర్ ఉత్పత్తులు
మగాళ్లలో ఆ శక్తి తగ్గడానికి కారణం ఇదేనా..? ఇవి మార్చుకోకపోతే..
మగాళ్లలో ఆ శక్తి తగ్గడానికి కారణం ఇదేనా..? ఇవి మార్చుకోకపోతే..
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. ఇక సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. ఇక సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే
ఇంట్లో సాలీడుల బెడద ఎక్కువా? ఈ ఒక్క సహజ సువాసనతో వాటిని దూరంగా..
ఇంట్లో సాలీడుల బెడద ఎక్కువా? ఈ ఒక్క సహజ సువాసనతో వాటిని దూరంగా..
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే ఈ పని అస్సలు చేయకండి..
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే ఈ పని అస్సలు చేయకండి..
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!
ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!