AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఫ్రాంచైజీలకు భారీ షాక్.. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త నిబంధనలు.. రంగంలోకి దిగిన బీసీసీఐ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో చాలా మంది సీనియర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్లు భారీగా డబ్బు సంపాదించారు. అయితే వారు ఖాళీగా ఉన్నా.. మొదటి రెండు వారాలు టోర్నమెంట్ ఆడలేరు.

IPL 2022: ఫ్రాంచైజీలకు భారీ షాక్.. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త నిబంధనలు.. రంగంలోకి దిగిన బీసీసీఐ..!
Ipl 2022
Venkata Chari
|

Updated on: Feb 22, 2022 | 6:59 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం (IPL 2022 Auction) లో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది. అయితే, దీనిపై ఐపీఎల్ జట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అసంతృప్తికి కారణం క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) అవ్వడంతో, ఫ్యాన్స్ అంతా పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏప్రిల్ 6 వరకు ఐపీఎల్‌లో పాల్గొనవద్దని తమ ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది. దీంతో ఫ్రాంచైజీలన్నీ ఢీలా పడ్డాయి. క్రికెట్ ఆస్ట్రేలియా తన కాంట్రాక్ట్ ఆటగాళ్లందరికీ ఈ ఆర్డర్‌ను జారీ చేసింది. ఈ ఆటగాళ్లలో పాట్ కమ్మిన్స్, డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లు తమ సంబంధిత IPL జట్లలో కీలకంగా ఉన్నారు. వారి గైర్హాజరుతో ఆయా జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆశలను నాశనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఐపీఎల్ (IPL 2022) కోసం పాకిస్థాన్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియన్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఆగిపోయినప్పటికీ, ఆ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడంతో జట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం , ‘ఈ ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టులో భాగమైతే అది వేరే విషయం. వారు పాకిస్తాన్ సిరీస్‌లో ఆడనప్పుడు వారిని ఆపడం ఏమిటని’ ఐపీఎల్ ఫ్రాంచైజీ అధికారి ఒకరు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయంపై జట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు 3-4 మ్యాచ్‌లు ఆడలేరు.. ఏప్రిల్ 6 తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఐపీఎల్‌కు పంపితే, కోవిడ్ ప్రోటోకాల్ పాటించిన తర్వాతే ఐపీఎల్‌లో చేరతారు. అంటే ఏప్రిల్ 11 లేదా 12న ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ జట్లతో చేరతారు. అంటే ఆ ఆటగాళ్లు 3-4 మ్యాచ్‌లు ఆడరు. నివేదిక ప్రకారం, ఐపీఎల్ జట్లు ఈ సమస్యను బీసీసీఐతో చర్చించబోతున్నాయి.

ఆటగాళ్లు పాకిస్తాన్ నుంచి ఎక్కడకు వెళ్లనున్నారు.. మార్చి 4 నుంచి పాకిస్తాన్‌లో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం వార్నర్, హేజిల్‌వుడ్, కమిన్స్ జట్టులో భాగంగా ఉన్నారు. ఈ సిరీస్ మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఈ సిరీస్ తర్వాత, ఈ ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్తారు. ఆ తర్వాత మార్చి 5 తర్వాత మాత్రమే వారు ఐపీఎల్‌కు వెళ్లడానికి అనుమతి ఉంది. ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. టోర్నమెంట్‌గా ఐపీఎల్‌పై నాకు పూర్తి గౌరవం ఉందని బెయిలీ పేర్కొన్నట్లు ‘క్రికెట్.కామ్.ఏయూ’ పేర్కొంది. టీ20 మ్యాచ్‌లలో ఐపీఎల్ అత్యున్నత స్థాయిని కలిగి ఉందని నేను భావిస్తున్నానని ఆయన తెలిపాడు.

“మా ఆటగాళ్లలో కొంతమంది నైపుణ్యాల అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైన టోర్నమెంట్ అని నేను భావిస్తున్నాను, కాబట్టి దానిని తక్కువ అంచనా వేయకూడదు” అని అతను వెల్లడించాడు. “ప్రోటోకాల్ ప్రకారం, ఏప్రిల్ 6 వరకు ఐపీఎల్ జట్టులో చేరడానికి కేంద్ర ఒప్పందం కుదుర్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు అందుబాటులో ఉండడు” అని బెయిలీ తెలిపారు. డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్, నాథన్ కౌల్టర్-నైల్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఒప్పందాలకు కట్టుబడి ఉండరు. ఇటువంటి పరిస్థితిలో, ఈ ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభం నుంచి ఫ్రాంచైజీ జట్లలో చేరడానికి సిద్ధంగా ఉంటారు.

Also Read: IND vs SL, 1st T20I: టీమిండియా ప్లేయింగ్ XIలో కీలక మార్పులు.. సీనియర్ల రాకతో వీరు బెంచ్‌కే పరిమితం?

NZ Vs IND: 26 బంతుల్లో హాఫ్ సెంచరీ.. కివీస్‌లో భారత వికెట్ కీపర్ తుఫాన్ ఇన్నింగ్స్‌.. 14 ఏళ్ల నాటి రికార్డులకు బ్రేకులు..