ముంబయి ఇండియన్స్కు ఎదురుదెబ్బ
ముంబయి: ఐపీఎల్ టోర్నీ మెదలవకముందే ముంబయి ఇండియన్స్కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ లసిత్ మలింగ మొదటి ఆరు మ్యాచులకు దూరం కానున్నాడు. ప్రపంచకప్ ఆటగాళ్ల ఎంపిక కోసం జరుగుతున్న టోర్నీలో మలింగ పాల్గొనాల్సి ఉంది. రానున్న ప్రపంచకప్లో చోటు సంపాదించాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ప్రతిభ నిరూపించాల్సి ఉంటుందని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఒకవేళ ముంబయి ఇండియన్స్ తరపున ఆడేందుకు కొంతకాలం తర్వాత తాను సిద్ధమైనప్పటికీ.. తన కోసం ఎదురు చూడకుండా […]
ముంబయి: ఐపీఎల్ టోర్నీ మెదలవకముందే ముంబయి ఇండియన్స్కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ లసిత్ మలింగ మొదటి ఆరు మ్యాచులకు దూరం కానున్నాడు. ప్రపంచకప్ ఆటగాళ్ల ఎంపిక కోసం జరుగుతున్న టోర్నీలో మలింగ పాల్గొనాల్సి ఉంది. రానున్న ప్రపంచకప్లో చోటు సంపాదించాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ప్రతిభ నిరూపించాల్సి ఉంటుందని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఒకవేళ ముంబయి ఇండియన్స్ తరపున ఆడేందుకు కొంతకాలం తర్వాత తాను సిద్ధమైనప్పటికీ.. తన కోసం ఎదురు చూడకుండా ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడికి అవకాశం ఇస్తే బాగుటుందని మలింగ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మలింగతో పాటు న్యూజిలాండ్ పేస్ బౌలర్ ఆడం మిల్నే కూడా గాయం కారణంగా సీజన్కు దూరమయ్యాడు. అయితే మలింగ స్థానాన్ని వెస్టిండీస్ స్పీడ్ స్టర్ అల్జారీ జోసెఫ్తో భర్తీ చేసే అవకాశాలున్నాయి.