IPL Broadcasting Rights: ఆదాయం కోసం బీసీసీఐ భారీ స్కెచ్.. వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రసారాల్లో కీలక మార్పులు?

2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు.. గత 15 ఏళ్లలో ఒకే ఒక్క బ్రాడ్‌కాస్టర్‌కు మ్యాచ్‌‌లను ప్రసారం చేసే హక్కులు ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది.

IPL Broadcasting Rights: ఆదాయం కోసం బీసీసీఐ భారీ స్కెచ్.. వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రసారాల్లో కీలక మార్పులు?
Ipl 2022
Follow us

|

Updated on: Mar 01, 2022 | 8:23 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఐపీఎల్ తేదీలు, కొత్త ఫార్మాట్‌ను ప్రకటించడంతో టోర్నమెంట్ గురించి వాతావరణం వెడెక్కింది. పూర్తి షెడ్యూల్ ఇంకా రావలసి ఉంది. ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ కేసులు లేకపోవడంతో.. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడమే బోర్డు ముందు లక్ష్యంగా నెలకొంది. అయితే ఇది కాకుండా, BCCI ముందు మరొక ముఖ్యమైన సమస్య ఉంది. అది టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రసార హక్కులు(IPL Broadcasting Rights). ప్రస్తుత సీజన్‌ను స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లలో చూడవచ్చు. అయితే వచ్చే సీజన్ నుంచి పరిస్థితి మారవచ్చు. స్టార్ మాత్రమే కాకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను 2 లేదా 3 వేర్వేరు ఛానెల్‌లలో ప్రసారం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

2008లో IPL ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు, ప్రతి సీజన్‌లో టోర్నమెంట్‌ను ప్రదర్శించడానికి ఒక బ్రాడ్‌కాస్టర్ మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. ప్రారంభ సంవత్సరాల్లో, సోనీ నెట్‌వర్క్ IPLని ప్రసారం చేసింది. అయితే గత కొన్ని సీజన్లలో, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసార హక్కులను కలిగి ఉంది. IPL ప్రసారాల ప్రస్తుత హక్కులు ఈ సీజన్‌తో ముగుస్తుంది. తదుపరి సీజన్‌కు కొత్త మీడియా హక్కుల ప్రక్రియను బోర్డు ప్రారంభించబోతోంది. దీని నుంచి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలని బీసీసీఐ భావిస్తోంది.

మరిన్ని ఛానెల్‌లు, ఎక్కువ సంపాదనే లక్ష్యంగా బీసీసీఐ అడుగులు.. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం , ఈసారి కేవలం ఒక బ్రాడ్‌కాస్టర్‌కు అన్ని హక్కులను ఇచ్చే బదులు, 3 లేదా 4 బిడ్డర్లకు సమానంగా లేదా భిన్నమైన నిష్పత్తిలో పంపిణీ చేయవచ్చు. ఎంత ఎక్కువగా ప్రసారాలు ఉంటే అంత సంపాదన ఉంటుందని బోర్డు అభిప్రాయపడింది. ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా కొత్త ఒప్పందాన్ని అమల్లోకి తీసుకరానున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని బోర్డు అంచనా వేస్తోంది. నివేదిక ప్రకారం, స్టార్ కాకుండా, సోనీ, రిలయన్స్ గ్రూప్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త డీల్ కోసం వేలంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటిలో అన్ని హక్కులు ఒకే సంస్థకు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికీ కొద్దిగా వాటా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం, ఇంగ్లాండ్ ప్రసిద్ధ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రీమియర్ లీగ్‌లో ఇటువంటి సంప్రదాయం ఉంది. దీనిలో 3 లేదా 4 వేర్వేరు ప్రసార సంస్థలు వేర్వేరు మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి హక్కులను కలిగి ఉన్నారు. బోర్డు కూడా దానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే బిడ్డింగ్ బ్రాడ్‌కాస్టర్లు దీనికి సిద్ధంగా ఉంటారా లేదా అనేది స్పష్టంగా లేదు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీని ప్రకారం, ప్రధానంగా వారాంతపు మ్యాచ్‌లను ప్రదర్శించే హక్కును బోర్డు ఇవ్వగలదని నమ్ముతున్నారు.

డిజిటల్, టీవీ ప్రసారాలు విడివిడిగా.. ఇది మాత్రమే కాదు, బోర్డు ఈసారి డిజిటల్, టెలివిజన్ ప్రసార హక్కులను కూడా వేరు చేయబోతోంది. ఇప్పటి వరకు ఒకే సంస్థ ఈ రెండింటిలో మ్యాచులను ప్రసారం చేసేది. ప్రస్తుత సీజన్ వరకు ఈ హక్కు స్టార్‌తో ఉంది. దీని కింద స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లు అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లను చూడవచ్చు.

బ్రేక్ సమయం కూడా పెరగనుంది.. అయితే బ్రాడ్‌కాస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడమే కాదు.. వారికి సంపాదనను పెంచడానికి కూడా బోర్డు కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం, మ్యాచ్‌ల మధ్య వ్యూహాత్మక సమయ వ్యవధిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 150 సెకన్లు అంటే 2.5 నిమిషాలు ఉండగా, వచ్చే ఏడాది నుంచి 30 సెకన్లు పెంచడం ద్వారా 3 నిమిషాలకు మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా, ఒక మ్యాచ్‌లోని 4 వ్యూహాత్మక టైమ్ అవుట్‌లలో, ప్రకటనల కోసం 2 నిమిషాల అదనపు సమయం అందుబాటులో ఉంటుంది.

Also Read: Virat Kohli 100th Test: కోహ్లీ స్పెషల్ టెస్టుపై ఎందుకంత వివక్ష.. కావాలనే బీసీసీఐ అలా చేస్తోదంటూ ఫైరవుతోన్న ఫ్యాన్స్..

Aus vs Pak: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు ఎదురు దెబ్బ.. హరీస్ రౌఫ్‌కు కరోనా నిర్ధారణ..