AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan : ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ తర్వాత..పాక్ ఆటగాళ్లను మరోసారి చేదు అనుభవం

క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అయితే గత కొంతకాలంగా ఈ రెండు దేశాల ఆటగాళ్ల మధ్య ఆట ముగిసిన తర్వాత కూడా ఒక రకమైన వివాదం కొనసాగుతోంది. తాజాగా హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్‎లో భారత్, పాకిస్తాన్‌పై 2 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత మరోసారి ఇదే పరిస్థితి రిపీట్ అయింది.

India vs Pakistan : ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ తర్వాత..పాక్ ఆటగాళ్లను మరోసారి చేదు అనుభవం
India Pakistan Handshake Controversy
Rakesh
|

Updated on: Nov 07, 2025 | 7:03 PM

Share

India vs Pakistan : క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అయితే గత కొంతకాలంగా ఈ రెండు దేశాల ఆటగాళ్ల మధ్య ఆట ముగిసిన తర్వాత కూడా ఒక రకమైన వివాదం కొనసాగుతోంది. తాజాగా హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్‎లో భారత్, పాకిస్తాన్‌పై 2 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత మరోసారి ఇదే పరిస్థితి రిపీట్ అయింది. మ్యాచ్ ముగిశాక భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడానికి ముందుకు రాలేదు. ఈ పరిణామం ఆసియా కప్ 2025లో మొదలైన ఒక నూతన సంప్రదాయాన్ని కొనసాగించినట్టైంది.

హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్‌లో నవంబర్ 7న జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా భారత్ 2 పరుగుల తేడాతో గెలుచుకుంది. అయితే, మ్యాచ్ ఫలితం ప్రకటించిన తర్వాత ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన క్రీడా స్ఫూర్తి కనిపించలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత సాధారణంగా జరిగే విధంగా ఇరు జట్ల ఆటగాళ్లు బయటకు వచ్చి షేక్ హ్యండ్ చేసుకోలేదు. భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపడానికి ముందుకు రాకపోవడం ఈ వివాదానికి కారణమైంది.

ఆసియా కప్ 2025 నుంచి మహిళల ప్రపంచ కప్ 2025లో కూడా భారత జట్లు పాకిస్తాన్ జట్లతో షేక్ హ్యాండ్ చేయడాన్ని నిరాకరించాయి. హాంగ్ కాంగ్ సిక్స్ టోర్నమెంట్‌లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. భారత్,పాకిస్తాన్ మధ్య ఈ హ్యాండ్‌షేక్ వివాదం ఆసియా కప్ 2025 నుంచి తీవ్రమైంది. సెప్టెంబర్ 14న భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ ఆఘా హ్యాండ్‌షేక్ చేసుకోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపలేదు.

సెప్టెంబర్ 28న ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత, టీమిండియా ఆటగాళ్లు పీసీబీ ఛీఫ్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారు. ఈ ట్రోఫీ వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ట్రోఫీ నఖ్వీ వద్దే ఉన్నట్లు సమాచారం. నవంబర్ 7న జరిగిన ఈ హాంగ్ కాంగ్ టోర్నమెంట్ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. రాబిన్ ఉతప్ప కేవలం 11 బంతుల్లో 28 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 6 ఓవర్లలో టీమిండియా 86 పరుగులు చేసింది. 87 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్, 3 ఓవర్లలో 41 పరుగులు చేసింది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్‌ను 2 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌