AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs SLW: ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. టీమిండియా నయా ‘గోస్వామి’.. దెబ్బకు లంక ఢమాల్.. టార్గెట్ ఎంతంటే?

భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. దీంతో భారత్‌ ముందు 66 పరుగుల టార్గెట్ ఉంది.

INDW vs SLW: ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. టీమిండియా నయా 'గోస్వామి'.. దెబ్బకు లంక ఢమాల్.. టార్గెట్ ఎంతంటే?
India Women Vs Sri Lanka Wo
Venkata Chari
|

Updated on: Oct 15, 2022 | 2:48 PM

Share

శనివారం సిల్హెట్‌లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఖరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. రాధా యాదవ్‌కు బదులుగా హేమలతకు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంంది. కాగా శ్రీలంక జట్టులో ఎలాంటి మార్పు లేదు. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

అయితే, ఈ మ్యాచ్‌లో భాతర బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా రేణుకా సింగ్ తన బౌలింగ్‌తో లంకను దారుణంగా దెబ్బ తీసింది. ఆమె తన మొత్తం 3 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఇందులో 1 ఓవర్ మెయిడీన్ కావడం విశేసం. ఆ తర్వాత రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు, స్నేహా రాణా 2 వికెట్లు పడగొట్టింది. ఆది నుంచి శ్రీలంక ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా భారత బౌలర్లు ధీటుగా రాణించారు. లంక టీంలో కేవలం ఇద్దరు మాత్రమే రెండెంకల స్కోర్ దాటారు. మిగతా బ్యాటర్ల అంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఓ దశలో 5 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. కనీసం 10 ఓవర్లైనా ఆడుతుందా అనిపించింది. కానీ, ఆ తర్వాత బ్యాటర్లు పరుగుల కోసం కాకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు బ్యాటింగ్ చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేయగలిగింది.

ఈ మ్యాచ్ టీమిండియా గెలిస్తే 7వ టైటిల్ సొంతం చేసుకుంటుంది. తద్వారా భారత్‌కు 7వ టైటిల్ అవనుంది. ఇరు జట్లు 5వ సారి ఫైనల్‌లో తలపడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని ఫైనల్స్‌లోనూ భారత్‌ విజయం సాధించింది. టోర్నీలో 8 సార్లు ఫైనల్స్‌కు చేరిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. అలాగే భారత్ అత్యధికంగా ఆరుసార్లు ట్రోఫీని గెలిచింది.

14 ఏళ్ల తర్వాత..

శ్రీలంక 14 ఏళ్ల తర్వాత ఫైనల్ ఆడుతోంది. అంతకుముందు 2008లో ఆ జట్టు ఫైనల్ చేరింది. అయితే భారత్‌ నుంచి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఇరు జట్లు:

భారత మహిళలు (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దీప్తి శర్మ, రిచా ఘోష్ (w), పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్

శ్రీలంక మహిళలు (ప్లేయింగ్ XI): చమరి అతపత్తు(సి), అనుష్క సంజీవని(w), హర్షిత మాదవి, హాసిని పెరీరా, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, మల్షా షెహాని, ఓషాది రణసింగ్, సుగండిక కుమారి, ఇనోకా రణవీర, అచ్చిని కులసూర్య

Follow Us
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?