AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: టీమిండియాకు గుడ్ న్యూస్.. కరోనా పరీక్షలో వారికి నెగిటివ్.. జట్టులోకి ఇషాన్ కిషన్..

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా షాక్ తగిలింది. ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శిఖర్ ధావన్, రితురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్‌లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది...

IND vs WI: టీమిండియాకు గుడ్ న్యూస్.. కరోనా పరీక్షలో వారికి నెగిటివ్.. జట్టులోకి ఇషాన్ కిషన్..
U19 World Cup Teamindia
Srinivas Chekkilla
|

Updated on: Feb 03, 2022 | 8:17 PM

Share

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా షాక్ తగిలింది. ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శిఖర్ ధావన్, రితురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్‌లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పుడు వీరంతా ఒంటరిగా ఉన్నారు. దీంతో గురువారం మరోసారి మొత్తం జట్టు సభ్యులకు ఆర్టీపీసీఆర్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో భారత జట్టులోని ఇతర ఆటగాళ్లు ఎవరూ కరోనా సోకలేదని తెలిసింది. నివేదికల ప్రకారం, టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ క్వారంటైన్ వ్యవధిని ముగించారు. గురువారం అందరూ తేలికపాటి శిక్షణ తీసుకున్నారు.

పీటీఐ నివేదిక ప్రకారం శిఖర్ ధావన్, రితురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ మినహా మిగతా ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ చేశారు. అదే సమయంలో మయాంక్ అగర్వాల్ జట్టులో చేరాడు. అతను మూడు రోజుల వరకు నిర్భంధంలో ఉంటాడు. ముగ్గురు కరోనా బారిన పడడంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది. ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్‌లో రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయడం చూడవచ్చు.

Read Also.. Virat Kohli: 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ.. బెంగళూరులో కాదు మొహాలీలో.. ఎందుకంటే..