Ind vs WI 3rd ODI: మూడో వన్డేలో 265 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. రాణించిన అయ్యర్, పంత్, దీపక్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జరుగుతున్న మూడో వన్డేలో భారత్ చేసింది...

Ind vs WI 3rd ODI: మూడో వన్డేలో 265 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. రాణించిన అయ్యర్, పంత్, దీపక్..
India
Follow us

|

Updated on: Feb 11, 2022 | 5:30 PM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ జరుగుతున్న మూడో వన్డేలో భారత్ చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ కూడా వెనుదిరిగాడు. కష్టల్లో భారత్‌ను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి.

రిషబ్ బంత్ 54 బంతుల్లో 56(ఆరు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. భారత్ నిలదొక్కుకుంటున్న సమయంలో వెస్టిండీస్ బౌలర్ వాల్ష్ పంత్ ఔట్ చేశాడు. దీంతో శ్రేయస్, పంత్‌ల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యాకుమార్ యాదవ్ ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు.

క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపిస్తో్న్న శ్రేయస్ అయ్యర్‌ను వాల్ష్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ చాహర్ దాటిగా ఆడాడు. 38 బంతుల్లో 38(4 ఫోర్లు, 2 సిక్స్)పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు, జోసెఫ్, వాల్ష్ రెండేసి వికెట్లు తీశారు. అలెన్, స్మిత్ చేరో వికెట్ పడగొట్టారు.

Read Also.. వేలం ఎలా జరుగుతుంది.. బేస్ ప్రైజ్‌ డిసైడ్ చేసేది ఎవరు.. డబ్బంతా ప్లేయర్లకు అందుతుందా? పూర్తి వివరాలు..