AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ VS శ్రీలంక: ఇండియా టార్గెట్ 265

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక మొదట తడబడినా..తర్వాత కోలుకుని గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కోహ్లీ సేనకు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏంజెలో మాథ్యూస్ అద్భుత సెంచరీకి తోడు లహిరు తిరుమన్నె అర్ధ శతకంతో రాణించడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మాథ్యూస్, తిరుమన్నె ఆదుకున్నారు. క్రీజులో […]

భారత్ VS శ్రీలంక: ఇండియా టార్గెట్ 265
Ram Naramaneni
|

Updated on: Jul 06, 2019 | 7:22 PM

Share

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక మొదట తడబడినా..తర్వాత కోలుకుని గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కోహ్లీ సేనకు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏంజెలో మాథ్యూస్ అద్భుత సెంచరీకి తోడు లహిరు తిరుమన్నె అర్ధ శతకంతో రాణించడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మాథ్యూస్, తిరుమన్నె ఆదుకున్నారు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.  భారత బౌలర్లలో బుమ్రా(3/37) మరోసారి మ్యాజిక్ బౌలింగ్‌తో లంక టాప్ ఆర్డర్‌ను కోల్కోలేని దెబ్బతీశాడు. కుల్దీప్, భువనేశ్వర్ కుమార్, జడేజా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.