AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ పై మూడో సెంచరీ: మాథ్యూస్

ఐసీసీ వరల్ద్ కప్ 2019లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక అనూహ్యంగా పుంజుకుంది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్ క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు తిరుమన్నె అతడికి చక్కని సహకారం అందించాడు. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ బ్యాట్ ఝళిపించడం ప్రారంభించారు. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ఉరికించారు. మరోవైపు భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు శ్రీలంకకు కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి […]

భారత్ పై మూడో సెంచరీ: మాథ్యూస్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 7:04 PM

Share

ఐసీసీ వరల్ద్ కప్ 2019లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక అనూహ్యంగా పుంజుకుంది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన ఏంజెలో మాథ్యూస్ క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు తిరుమన్నె అతడికి చక్కని సహకారం అందించాడు. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ బ్యాట్ ఝళిపించడం ప్రారంభించారు. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ఉరికించారు.

మరోవైపు భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు శ్రీలంకకు కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి మాథ్యూస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో మాథ్యూస్‌కు ఇది తొలి సెంచరీ కాగా, ఓవరాల్‌గా మూడోది. అయితే, ఈ మూడూ భారత్‌పైనే సాధించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో 179 పరుగుల వద్ద అర్ధ సెంచరీ బాదిన తిరుమన్నె (53) అవుటైనా మాథ్యూస్ మాత్రం బాదుడు ఆపలేదు. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 7 వికెత్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.