IND vs SL 3rd T20I: టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ డిసైడ్ చేసేనా.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..
ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలకం మొదట బౌలింగ్ చేయనుంది.
భారత్-శ్రీలంక టీ20 సిరీస్లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలకం మొదట బౌలింగ్ చేయనుంది.
ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా తొలిసారి శ్రీలంక వేదికగా స్వదేశంలో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. 4 సంవత్సరాల క్రితం 2019లో స్వదేశంలో భారత్ ద్వైపాక్షిక సిరీస్ను కోల్పోయింది. ఆస్ట్రేలియా చేతిలో 2-0 తేడాతో ఓడింది. అప్పటి నుంచి భారత్ స్వదేశంలో వరుసగా 11 సిరీస్లను గెలుచుకుంది.
ఈ మ్యాచ్లో భారత జట్టు గెలిస్తే శ్రీలంకతో వరుసగా 5వ టీ20 సిరీస్ను కైవసం చేసుకుంటుంది. హార్దిక్ సారథ్యంలోని భారత జట్టు ఓడిపోతే తొలిసారి సిరీస్ను చేజార్చుకుంది. భారత్లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఐదు ద్వైపాక్షిక సిరీస్లు ఆడాయి. భారత్ 4 గెలిచింది. ఒకదాంట్లో సమానంగా నిలిచాయి.
ఇరుజట్లు..
శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక
భారత్ ప్లేయింగ్ XI: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..