AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడో టీ20: టీమిండియాలో కీలక మార్పు.. తుది జట్టులోకి రోహిత్ శర్మ.. ఆ స్టార్ ప్లేయర్‎పై వేటు.!

India Vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఇరు జట్లూ 1-1తో సిరీస్ సమం చేయగా..

మూడో టీ20: టీమిండియాలో కీలక మార్పు.. తుది జట్టులోకి రోహిత్ శర్మ.. ఆ స్టార్ ప్లేయర్‎పై వేటు.!
Ravi Kiran
|

Updated on: Mar 16, 2021 | 3:44 PM

Share

India Vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఇరు జట్లూ 1-1తో సిరీస్ సమం చేయగా.. మూడో మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‎లోని మొతేరా స్టేడియం వేదికగా జరగనుంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ ప్రభావం కారణంగా మిగతా మూడు టీ20లకు బీసీసీఐ ప్రేక్షకులను అనుమతించలేదు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ గెలిచేందుకు ఇరు జట్లూ నెట్స్‎లో విపరీతమైన శ్రమించాయి. ఈ క్రమంలోనే టీమిండియా, ఇంగ్లాండ్ తుది జట్టు కూర్పు విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‎లో కెప్టెన్ విరాట్ కోహ్లీ  ప్లేయింగ్ ఎలెవన్‎లో కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి, తొలి టీ 20 మ్యాచ్‎కు ముందు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా బరిలోకి దిగుతారని.. శిఖర్ ధావన్ రిజర్వ్ ఓపెనర్ అని కెప్టెన్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్‎లో వెల్లడించాడు. అయితే ఆ తర్వాత తొలి రెండు మ్యాచ్‎లకు రోహిత్ శర్మ లేకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక మొదటి మ్యాచ్‎లో ఓపెనింగ్ జోడిగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ పేలవ ఫామ్‎తో నిరాశపరిచారు. ఇక రెండో మ్యాచ్‎లో ధావన్‎ను తొలగించి.. ఇషాన్ కిషన్‎ ఓపెనర్‎గా రావడమే కాకుండా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. దీనితో మూడో మ్యాచ్‎లో కీలక మార్పు చేసేందుకు విరాట్ కోహ్లీ, టీమ్ మేనేజ్‎మెంట్ సిద్ధమైంది.

రాహుల్ ఔట్.. రోహిత్ శర్మ ఇన్…

రెగ్యులర్ టీ20 ఓపెనర్, హిట్‎మ్యాన్ రోహిత్ శర్మను బరిలోకి దింపేందుకు టీమిండియా సిద్ధమైంది. కేఎల్ రాహుల్ స్థానంలో అతడు తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పుతో పాటు పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్‎ను తిరిగి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మార్పులు టీమిండియాలో ఉండే అవకాశం కనిపిస్తోంది. యధావిధిగా మరో ఓపెనర్‎గా ఇషాన్ కిషన్, కోహ్లీ తర్వాత శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు బరిలోకి దిగుతారు.

టీమిండియా జట్టు(అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్

ఇంగ్లాండ్ జట్టు(అంచనా): జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మాలన్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, సామ్ కరన్, టామ్ కరన్, జోర్డాన్, ఆర్చర్, రషీద్

మరిన్ని ఇక్కడ చదవండి:

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

Follow Us