AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: సిరీస్ ఓటమితో టీమిండియాకు భారీ షాక్.. ఇంటికి తిరిగి రానున్న ముగ్గురు ఆటగాళ్లు..

రోహిత్ ఇకపై సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఆడలేడు. టెస్టు సిరీస్‌లో అతనికి ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

IND vs BAN: సిరీస్ ఓటమితో టీమిండియాకు భారీ షాక్.. ఇంటికి తిరిగి రానున్న ముగ్గురు ఆటగాళ్లు..
Rohit Sharma Sixes Records
Venkata Chari
|

Updated on: Dec 08, 2022 | 6:05 AM

Share

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. రోహిత్ ఎడమ చేతి బొటన వేలికి గాయం కావడంతో స్కానింగ్ కోసం తరలించారు. రోహిత్ ఇకపై సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో పాల్గొనలేడు. అతనికి టెస్ట్ సిరీస్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రెండో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ విషయాన్ని ప్రకటించాడు.

పీటీఐ ప్రకారం, రెండో మ్యాచ్ ముగిసిన తర్వాత, నిపుణుల సలహా కోసం రోహిత్ తిరిగి ముంబైకి వెళ్తాడని, వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో పాల్గొననని ద్రవిడ్ తెలిపాడు. ఇది కాకుండా, రోహిత్ టెస్ట్ సిరీస్‌కు తిరిగి రాగలడా లేదా అనే దానిపై కూడా ద్రవిడ్ ఖచ్చితంగా తెలియజేయలేదు. రోహిత్ బొటనవేలులో ఎటువంటి ఫ్రాక్చర్ లేనప్పటికీ, అతని గాయం ఇంకా తీవ్రంగా ఉండవచ్చని తెలుస్తోంది.

ఆజ్ తక్ నివేదిక ప్రకారం, రోహిత్ కాకుండా, భారత జట్టులోని మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ముంబైకి తిరిగి రానున్నారు. దీపక్ చాహర్, కుల్దీప్ సేన్‌లను కూడా వెనక్కి పంపనున్నారు. రెండో వన్డే ఆడుతున్న దీపక్ స్నాయువు సమస్యతో ఇబ్బంది పడుతుండగా, అన్ క్యాప్డ్ ఆటగాడు కుల్దీప్ సేన్ వెన్నులో గాయంతో ఉన్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు తిరిగి వెళ్లి NCAలో చేరనున్నారు.

ఇవి కూడా చదవండి

గాయంతో ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేసిన రోహిత్..

ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతన్ని స్కాన్ కోసం తీసుకెళ్లారు. మళ్లీ ఫీల్డింగ్‌కు రాకపోవడంతో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేశాడు. జట్టు చాలా కష్టాల్లో ఉన్నందున రోహిత్ తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్ 28 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేసి భారత్‌ను విజయానికి చేరువ చేసినా, ఆయన ప్రయత్నం ఫలించలేదు. రోహిత్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 41 పరుగులు చేయాల్సి ఉండగా, ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..