U19 Asia Cup 2025 : అండర్-19 ఆసియా కప్ టీమ్ ప్రకటించిన బీసీసీఐ..కెప్టెన్గా ఆయుష్ కానీ అందరి చూపు బుడ్డోడి మీదే
భారత యువ క్రికెట్ జట్టు అండర్-19 ఆసియా కప్లో తమ జెండాను ఎగురవేయడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 21 వరకు దుబాయ్లో జరగనున్న ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం బీసీసీఐ శనివారం 15 మంది సభ్యులతో కూడిన భారత స్క్వాడ్ను ప్రకటించింది.

U19 Asia Cup 2025 : భారత యువ క్రికెట్ జట్టు అండర్-19 ఆసియా కప్లో తమ జెండాను ఎగురవేయడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 21 వరకు దుబాయ్లో జరగనున్న ఈ ముఖ్యమైన టోర్నమెంట్ కోసం బీసీసీఐ శనివారం 15 మంది సభ్యులతో కూడిన భారత స్క్వాడ్ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ సహా మొత్తం ఐదు టీమ్లు పాల్గొంటున్నాయి. ఈ జట్టుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే ఆయుష్ మ్హాత్రేను కెప్టెన్గా నియమించారు.
యువ భారత్ జట్టుకు ఆయుష్ మ్హాత్రే కెప్టెన్గా వ్యవరించనుండగా, విహాన్ మల్హోత్రా వైస్-కెప్టెన్గా సెలక్ట్ అయ్యాడు. అయితే, అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. వైభవ్ ఇటీవలే జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో యూఏఈపై కేవలం 32 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. ఆ టోర్నమెంట్లో భారత్ ఫైనల్కు చేరుకోనప్పటికీ, వైభవ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత జట్టులో అభిజ్ఞాన్ కుండూ, హర్వంశ సింగ్ వంటి వికెట్ కీపర్లు కూడా ఉన్నారు.
అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్లో భారత జట్టును గ్రూప్ A లో ఉంచారు. ఈ గ్రూప్లో భారత్, పాకిస్తాన్ జట్లతో పాటు, మరో రెండు క్వాలిఫైయర్ టీమ్లు వచ్చి చేరతాయి. క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ డిసెంబర్ 14 న జరగనుంది. ఇక గ్రూప్ B లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఒక క్వాలిఫైయర్ టీమ్ ఆడనున్నాయి. టోర్నమెంట్ యొక్క పూర్తి షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు.
అండర్-19 ఆసియా కప్కు భారత స్క్వాడ్
ఆయుష్ మ్హాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండూ (వికెట్ కీపర్), హర్వంశ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఎ. పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్*, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జ్.
స్టాండ్బై ఆటగాళ్లు: రాహుల్ కుమార్, హేమచుదేశన్ జె, బి.కె. కిషోర్, ఆదిత్య రావత్.




