AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: లగేజీ సర్దుకుని వచ్చేయండ్రా అబ్బాయిలు.. హ్యాపీగా ఐపీఎల్ ఆడుకోవచ్చు..!

India Biggest Defeat in T20Is: ఈ పరాజయం భారత క్రికెట్ జట్టుకు ఒక పెద్ద మేల్కొలుపు లాంటిది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ నిలబెట్టుకోవాలంటే తదుపరి జరగబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది. జూలై 9న బ్రిస్టల్ వేదికగా జరగబోయే నాలుగో టీ20లోనైనా భారత్ పుంజుకుని అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

Team India: లగేజీ సర్దుకుని వచ్చేయండ్రా అబ్బాయిలు.. హ్యాపీగా ఐపీఎల్ ఆడుకోవచ్చు..!
Ind Vs Eng
Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 10:40 AM

Share

India Biggest Defeat in T20Is: భారత క్రికెట్ అభిమానులు కలలో కూడా ఊహించని ఘోర పరాజయాన్ని టీమిండియా చవిచూసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మన జట్టు ఘోరంగా కుప్పకూలింది. చేతుల్లో వికెట్లు ఉన్నా, క్రీజులో నిలదొక్కుకోలేక పరుగుల వరద పారించాల్సిన చోట చేతులెత్తేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇది అత్యంత పెద్ద అవమానకర ఓటమిగా మిగిలిపోయింది.

ఆరంభం నుంచే ఇంగ్లండ్ ఉధృతి.. సాల్ట్ మెరుపులు

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 70 పరుగులతో భారత బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవడంతో ఆతిథ్య జట్టుకు తిరుగులేకుండా పోయింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి.

ఇది కూడా చదవండి: ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!

ఇవి కూడా చదవండి

కార్డుల పేకలా కూలిన భారత బ్యాటింగ్ లైనప్..

202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ సేన ఏ దశలోనూ పోరాడే పటిమను ప్రదర్శించలేదు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. కనీసం పోరాటం కూడా చేయకుండా కేవలం 11.4 ఓవర్లలోనే 72 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. టీ20 చరిత్రలో భారత్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. కేవలం 11.4 ఓవర్లలోనే ఇన్నింగ్స్ ముగిసిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఆలౌట్ అయిన రికార్డుగా నమోదైంది.

మూటగట్టుకున్న చెత్త రికార్డులు ఇవే..

ఈ ఒకే ఒక్క ఓటమితో టీమిండియా ఎన్నో అపకీర్తి మూటగట్టుకుంది. ఇప్పటివరకు భారత్ టీ20ల్లో ఎదుర్కొన్న అతిపెద్ద ఓటమి 80 పరుగులు (న్యూజిలాండ్‌పై, 2019లో). కానీ ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి సరికొత్త చెత్త రికార్డును నెలకొల్పింది. ఇంగ్లండ్ గడ్డపై ఒక జట్టుకు నమోదైన అత్యల్ప స్కోరు కూడా ఇదే కావడం విశేషం. మరోవైపు ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..!

గాంభీర్, అయ్యర్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు..

ఈ దారుణ పరాజయం తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త కోచ్ గౌతమ్ గాంభీర్ వ్యూహాలు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా 4 ఓటములు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో భారత్ గత ఐదు మ్యాచ్‌లుగా గెలవలేక అత్యంత సుదీర్ఘమైన విన్నింగ్స్ లేని రికార్డును కూడా మూటగట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us