IND vs WI: హిట్ మ్యాన్ హ్యాట్రిక్.. మ్యాచ్​లే కాదు.. సిరీస్​లు కూడా.. విండీస్​ని వైట్ వాష్ చేసిన భారత్..

కోల్​కత్తాలో వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో టీ20(T20) మ్యాచ్​లో భారత్ ఘన విజయం సాధించింది. 17 పరుగులు తేడాతో విజయం సాధించి..

IND vs WI: హిట్ మ్యాన్ హ్యాట్రిక్.. మ్యాచ్​లే కాదు.. సిరీస్​లు కూడా.. విండీస్​ని వైట్ వాష్ చేసిన భారత్..
india
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 21, 2022 | 6:37 AM

కోల్​కత్తాలో వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో టీ20(T20) మ్యాచ్​లో భారత్ ఘన విజయం సాధించింది. 17 పరుగులు తేడాతో విజయం సాధించి సిరీస్​ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. సూర్యాకుమార్ యాదవ్(suryakumar yadav) 31 బంతుల్లో 65 పరుగులే చేశాడు. ఇందులో ఏడు సిక్స్​లు, ఒక ఫోర్ ఉంది. వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, రెండు సిక్స్​లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 34, శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 7, రుత్​రాజ్ 4 పరుగులు సాధించారు. హోల్డర్, షేపర్డ్, చెస్, వాల్ష్ , డ్రకెస్ ఒక్కో వికెట్ తీశారు.

185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన వెస్టిండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వికెట్లు కోల్పోతున్నా నికోలస్ పూరన్ మాత్రం దాటిగా ఆడాడు. 47 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. చివర్లో షేఫర్డ్29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షల్ పటేలే మూడు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, షర్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.