IND vs AUS Final: అండర్-19 ప్రపంచ కప్లో టీమిండియానే కింగ్.. కోహ్లీ, కోహ్లీ సరసన ఉదయ్ చేరేనా?
U19 World Cup 2024: అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ ఆదివారం జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్తో ఆస్ట్రేలియా జట్టు తలపడనుంది. ఇప్పటి వరకు అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ను టీమిండియా 5 సార్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. మరోసారి ఫైనల్ మ్యాచ్లో గెలిచి తన రికార్డును తనే మార్చాలని కోరుకుంటోంది.
![IND vs AUS Final: అండర్-19 ప్రపంచ కప్లో టీమిండియానే కింగ్.. కోహ్లీ, కోహ్లీ సరసన ఉదయ్ చేరేనా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/ind-vs-aus-u19-wc-final-202.jpg?w=1280)
Team India In U19 World Cup Final: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా సవాలును ఎదుర్కోనుంది. ఇప్పటి వరకు అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ను భారత్ 5 సార్లు గెలుచుకుంది. ఇది కాకుండా టీమ్ ఇండియా 8 సార్లు అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడింది. అంటే ఇప్పటివరకు అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 5 సార్లు గెలుపొందగా, 3 సార్లు ఓటమిని చవిచూసింది. రికార్డు స్థాయిలో ఆరోసారి ఛాంపియన్గా నిలవాలనే ఉద్దేశ్యంతో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ఆరోసారి ఛాంపియన్గా నిలిచేందుకు భారత్ సిద్ధం..
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2000లో భారత జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్గా మహ్మద్ కైఫ్ ఉన్నాడు. ఆ తర్వాత, టీం ఇండియా అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2006 ఫైనల్కు చేరుకుంది. అయితే టైటిల్ మ్యాచ్లో పాకిస్థాన్తో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2008ని గెలుచుకుంది. ఆ తర్వాత 2012లో భారత జట్టు మూడోసారి ఛాంపియన్గా నిలిచింది. ఆ భారత జట్టుకు కెప్టెన్గా ఉన్ముక్త్ చంద్ పనిచేశాడు. ఇషాన్ కిషన్ నేతృత్వంలోని జట్టు అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్కు చేరినా టైటిల్ గెలవలేకపోయింది.
ఇప్పటివరకు ఫైనల్స్లో టీమిండియా ప్రదర్శన ఇదే..
Stage set for a cracking Sunday Final in the #U19WorldCup! 🏟️
India 🆚 Australia
Follow the match on https://t.co/Z3MPyeL1t7 and the official BCCI App 📱#BoysInBlue | #TeamIndia | #INDvAUS pic.twitter.com/lwJ4ag4wOc
— BCCI (@BCCI) February 8, 2024
ఆ తర్వాత అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2018లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. పృథ్వీ షా కెప్టెన్సీలో ఉన్న టీమిండియా ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయలేదు. ఈ విధంగా రికార్డు స్థాయిలో నాలుగోసారి భారత్ ఛాంపియన్గా నిలిచింది. అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2022లో భారత జట్టు ఐదోసారి విజేతగా నిలిచింది. ఆ సమయంలో టీమ్ ఇండియాకు యష్ ధుల్ నాయకత్వం వహించాడు. అయితే, మరోసారి భారత జట్టు అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుంది. ఈసారి టీమ్ ఇండియా కమాండ్ ఉదయ్ సహారన్ చేతిలో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధిస్తే అది ఆరో టైటిల్గా రికార్డులకెక్కుతుంది.
స్క్వాడ్లు:
భారత్: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ప్రియాంషు మోలియా, ఉదయ్ సహారన్(కెప్టెన్), సచిన్ దాస్, ముషీర్ ఖాన్, అరవెల్లి అవనీష్(కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబాని, సౌమీ పాండే, ఆరాధ్య శుక్లా, అన్ష్ గోసాయి, నమన్ గోసాయి, ధనుష్ గౌడ తివారీ, రుద్ర పటేల్, ప్రేమ్ దేవ్కర్, మహమ్మద్ అమన్, ఇన్నేష్ మహాజన్.
ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, హర్జాస్ సింగ్, సామ్ కాన్స్టాస్, హ్యూ వీబ్జెన్(కెప్టెన్), ఆలివర్ పీక్, లాచ్లాన్ ఐట్కెన్(కీపర్), రాఫ్ మాక్మిల్లన్, చార్లీ ఆండర్సన్, హర్కీరత్ బజ్వా, మహ్లీ బార్డ్మాన్, కల్లమ్ విడ్లర్, ర్యాన్ హిక్స్, టామ్ కాంప్బెల్, టామ్ స్ట్రేకర్, ఐడాన్ ఓ కానర్, కోరీ వాస్లీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..