AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కోహ్లీతో సెల్ఫీ అంటే అట్లుంటది.. నలుగురిపై కేసు నమోదు.. చాలా ఖరీదైంది బ్రో అంటూ నెటిజన్ల కామెంట్లు..

IND vs SL: 4 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మొదటిసారిగా బెంగళూరులో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. దీంతో ప్రేక్షకులను పూర్తి సామర్థ్యంతో రావడానికి అనుమతించారు. అయితే కొంతమంది అత్యుత్సాహంతో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు.

Watch Video: కోహ్లీతో సెల్ఫీ అంటే అట్లుంటది.. నలుగురిపై కేసు నమోదు.. చాలా ఖరీదైంది బ్రో అంటూ నెటిజన్ల కామెంట్లు..
Ind Vs Sl Virat Kohli
Venkata Chari
|

Updated on: Mar 14, 2022 | 4:37 PM

Share

బెంగుళూరు(Bengaluru Day Night Test)లో భారత్- శ్రీలంక(India vs Sri Lanka) జట్ల మధ్య జరుగుతున్న డే -నైట్ టెస్టు మ్యాచ్‌లో ప్రేక్షకుల నుంచి ఎంతో ఉత్సాహం నెలకొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత బెంగళూరు వేదికగా టెస్టు మ్యాచ్‌ నిర్వహిస్తున్నందున ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రేక్షకులను వచ్చేందుకు అనుమతించారు. ఆటువంటి పరిస్థితిలో కొంతమంది వీక్షకులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు. దీంతో వారు న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. బెంగళూరు టెస్ట్ రెండో రోజున నలుగురు అభిమానులు మైదానంలోకి ప్రవేశించి విరాట్ కోహ్లీతో ఫోటో(Fans Photo with Virat Kohli) దిగేందుకు ప్రయత్నించారు. విరీలో ఇద్దరు విజయం సాధించారు. కానీ, ప్రస్తుతం వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కోహ్లీతో సెల్ఫీ మరింత ఖరీదుగా మారిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మార్చి 13 ఆదివారం మ్యాచ్‌ రెండో రోజు చివరి క్షణాల్లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ సమయంలో క్రీజులో దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ జోడీ ఉన్నారు. ఇంతలో, మెండిస్ గాయపడటంతో, వైద్య పరీక్షల కారణంగా ఆటను కొద్దిసేపు నిలిపేశారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న నలుగురు యువకులు మైదానంలోకి దిగి విరాట్ కోహ్లీతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిలో ఇద్దరికి కోహ్లితో సెల్ఫీ దిగే అవకాశం లభించగా, మిగిలిన వారు సక్సెస్ కాలేకపోయాయి. భద్రతా సిబ్బంది వెంబడించడంతో కొన్ని సెకన్ల పాటు వారిని పరిగెత్తించారు. ఆ తర్వాత వారు భద్రతా సిబ్బందికి చిక్కారు.

ఐపీసీ, అంటువ్యాధి చట్టం కింద కేసు నమోదు..

వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం , ఈ సంఘటన తర్వాత, బెంగళూరు నగర పోలీసులు నలుగురు యువకులపై నేరపూరిత అతిక్రమణ ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన నలుగురు యువకులను వెంటనే స్టేడియం నుంచి బయటకు పంపినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. పోలీసులు వారిపై IPC సెక్షన్లు 447 (క్రిమినల్ ఉల్లంఘన), 269 (ప్రాణాంతకమైన అంటు వ్యాధిని వ్యాప్తి చేసే నిర్లక్ష్యపు చర్య), 271 (నిర్బంధం) కింద కేసు నమోదు చేశారు.

మ్యాచ్‌ పరిస్థితి..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆదివారం భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌ను 303 పరుగులకు ఆలౌట్ చేసి డిక్లేర్ చేయగా, ఆ తర్వాత శ్రీలంకకు 447 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 1 వికెట్ కోల్పోయింది. మూడో రోజు కూడా తొలి సెషన్‌లో శుభారంభం చేసిన శ్రీలంక మరో 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే హాఫ్ సెంచరీతో జట్టు తరుపున ఆడుతుండగా, కుశాల్ మెండిస్ 54 పరుగుల వద్ద ఔటయ్యాడు.

Also Read: Women’s World Cup 2022: పాకిస్తాన్ ఘోర పరాజయం.. బంగ్లా దెబ్బకు విలవిల.. 5 పరుగులకు 5 వికెట్లు డౌన్..

IPL 2022: ఐపీఎల్‌కు దూరం కానున్న 26 మంది ఆటగాళ్లు.. అత్యధికంగా నష్టపోయే టీంలు ఇవే..