AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: 128*, 131, 110*.. ప్రేమదాస స్టేడియంలో కింగ్ కోహ్లీ మెరుపులు.. ఈ సారి పాక్ బౌలర్లకు చుక్కలేనా..?

IND vs PAK: విరాట్ కోహ్లీ మెయిన్ అట్రాక్షన్‌గా మారిన ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో జరగనుంది. ఇదిలా ఉండగా అదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. చివరి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ తీసిన హారీస్ రవుఫ్.. ఆ తర్వాత చేసిన ఓవరాక్షనే ఇందుకు కారణం..

IND vs PAK: 128*, 131, 110*.. ప్రేమదాస స్టేడియంలో కింగ్ కోహ్లీ మెరుపులు.. ఈ సారి పాక్ బౌలర్లకు చుక్కలేనా..?
ఇందులో 45 సార్లు లెఫ్టార్మ్ స్పిన్నర్లకి తన వికెట్ సమర్పించుకున్నాడు. అదే సమయంలో కోహ్లీ 71.86 సగటుతో 2989 పరుగులు చేయగలిగాడు. అయితే 2022 నుంచి ఇప్పటి వరకు ఆడిన 12 వన్డే ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లి 8 సార్లు ఎడమచేతి వాటం స్పిన్నర్లకు వికెట్లు అందించడంలో ఆశ్చర్యం లేదు.
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 09, 2023 | 8:21 PM

Share

Asia Cup 2023: భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే దానికి ఉండే క్రేజ్ వేరే లెవెల్. అయితే ఆసియా కప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 2న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. కానీ క్రికెట్ అభిమానుల కోసం టీమిండియా, పాక్ సూపర్ 4 రౌండ్‌ మూడో మ్యాచ్‌లో రేపు మరోసారి తలపడబోతున్నాయి. విరాట్ కోహ్లీ మెయిన్ అట్రాక్షన్‌గా మారిన ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో జరగనుంది. ఇదిలా ఉండగా అదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. చివరి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ తీసిన హారీస్ రవుఫ్.. ఆ తర్వాత చేసిన ఓవరాక్షనే ఇందుకు కారణం. పైగా ప్రేమదాస స్టేడియం కోహ్లీకి బాగా కలిసొచ్చిన వేదిక.

కింగ్ వస్తున్నాడు.. 

ఇవి కూడా చదవండి

అవును, శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న ఆర్. ప్రేమదాస స్టేడియంలో కోహ్లీ మొత్తం 8 వన్డేలు ఆడి, 103.8 సగటుతో మొత్తం 519 పరుగులు చేశాడు. ఈ మైదానంలో కోహ్లీ ఆడిన చివరి మూడో ఇన్సింగ్స్‌ల్లోనూ మూడు సెంచరీలు నమోదు కావడం విశేషం. ప్రేమదాస మైదానంలో కోహ్లీ 128* (119), 131(96), 110* (116) రూపంలో మూడు శతకాలు బాదాడు. ఈ క్రమంలోనే రేపు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా కోహ్లీ పరుగుల వర్షం కురిపించాలని, కోహ్లీ 77వ అంతర్జాతీయ సంచరీని పాకిస్తాన్‌ పైనే చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదే మళ్లీ కావాలి..!

దాయాదుల పోరుకు రిజర్వ్ డే:

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్ డేని ప్రకటించింది. వేదిక ఏదైనా భారత్-పాక్ మ్యాచ్‌ అంటే కాసుల వర్షమే కాదా.. ఈ క్రమంలో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోతే సోమవారం కూడా మ్యాచ్ కొనసాగుతుంది. కాబట్టి ఈ సూపర్-4 స్థాయి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. ఫలితం తేలనుంది.

ఇరు జట్ల వివరాలు..

పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది మరియు ఉసామా మీర్, తయ్యబ్ తాహిర్ (రిజర్వ్ ప్లేయర్).

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, పర్దీష్ కృష్ణ.

Follow Us