AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 1st Semi Final: వాంఖడేలో ఒక్క సెమీ ఫైనల్ మ్యాచ్ గెలవని భారత్.. టెన్షన్ పెంచుతోన్న రికార్డులు..

IND vs NZ, ICC World Cup 2023: ఈ ప్రపంచకప్‌లో అజేయంగా కొనసాగిన టీమ్ ఇండియాకు వాంఖడే స్టేడియం రికార్డులు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వాంఖడే వేదికగా ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణంగా మారింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే మైదానంలో బుధవారం అంటే నవంబర్ 15న టీమిండియా న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టనుంది.

IND vs NZ 1st Semi Final: వాంఖడేలో ఒక్క సెమీ ఫైనల్ మ్యాచ్ గెలవని భారత్.. టెన్షన్ పెంచుతోన్న రికార్డులు..
Ind Vs Nz Semi Final
Venkata Chari
|

Updated on: Nov 13, 2023 | 3:05 PM

Share

బెంగుళూరులో నెదర్లాండ్స్ (India Vs Netherlands) జట్టును ఓడించడం ద్వారా టీమిండియా లీగ్ రౌండ్‌కు విజయవంతంగా వీడ్కోలు పలికింది. ఈ రౌండ్ ముగియడంతో సెమీఫైనల్‌లోకి ప్రవేశించే 4 జట్ల లెక్కలు కూడా తేలిపోయాయి. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. టోర్నీ నిబంధనల ప్రకారం.. లీగ్ మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత పాయింట్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు.. నాలుగో ర్యాంకర్ న్యూజిలాండ్ (India vs New Zealand)తో తలపడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో జరగనుంది. రెండో సెమీ ఫైనల్ నవంబర్ 15న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. కానీ ఈ ప్రపంచకప్ (ICC ODI World Cup 2023)లో అజేయంగా కొనసాగుతున్న టీమ్ ఇండియాకు వాంఖడే స్టేడియం రికార్డులు కాస్త ఇబ్బందిగా మారాయి. వాంఖడే వేదికగా ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణం.

1987లో ఇంగ్లండ్‌పై ఓడిపోయింది..

1983లో వెస్టిండీస్‌ను ఓడించి టీమిండియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. నాలుగేళ్ల తర్వాత జరిగిన ప్రపంచకప్‌లో భారత్ మరోసారి టైటిల్‌కు పోటీగా టోర్నీలోకి అడుగుపెట్టింది. అయితే భారత జట్టు ప్రయాణం సెమీ ఫైనల్‌లోనే ముగిసింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 35 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ఫైనల్‌ టిక్కెట్‌ను దక్కించుకుంది.

విండీస్‌పై రెండుసార్లు ఓటమి..

రెండు సంవత్సరాల తరువాత, నెహ్రూ కప్ సెమీ-ఫైనల్ అదే వాంఖడేలో భారతదేశం వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఆ తర్వాత 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో వెస్టిండీస్ మళ్లీ భారత్‌ను ఓడించింది.

కివీస్‌పై భారత్‌ సెమీస్‌ రికార్డు..

న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌లో భారత్ సాధించిన రికార్డును పరిశీలిస్తే.. 1985లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.

భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా..

View this post on Instagram

A post shared by ICC (@icc)

వాంఖడేలో భారత్‌ సెమీస్‌ ఓటమి కథ ఇలా ఉంటే.. ఈ మైదానంలో భారత్‌ ప్రపంచ ఛాంపియన్‌గా మారింది. 2011 ప్రపంచకప్‌లో శ్రీలంకను ఓడించిన భారత్ 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను గెలుచుకుంది. కానీ, గణాంకాలను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు వాంఖడే స్టేడియంలో జరిగిన ఏ సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ భారత్ గెలవకపోవడం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..