IND vs AUS: రాజ్‌కోట్ వన్డేలో టీమిండియా నయావాల్ ఆడతాడా? వైరలవుతోన్న ఫొటో..

Rohit Sharma, Cheteshwar Pujara, Jasprit Bumrah: రోహిత్‌తో పాటు గ్రేట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా మూడో వన్డే నుంచి టీమ్ ఇండియాకు రానున్నారు. ఈ ఆటగాళ్లందరూ మొదటి రెండు వన్డే మ్యాచ్‌లలో భాగం కాలేదు. అతనితో పాటు ఆసియా కప్ ఫైనల్ తర్వాత విశ్రాంతి తీసుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తిరిగి జట్టులోకి రానున్నాడు.

IND vs AUS: రాజ్‌కోట్ వన్డేలో టీమిండియా నయావాల్ ఆడతాడా? వైరలవుతోన్న ఫొటో..
Bumraj Rohit Pujara

Updated on: Sep 27, 2023 | 7:53 AM

IND vs AUS 3rd ODI, Cheteshwar Pujara: భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లోని మూడో, చివరి వన్డే నేడు అంటే సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం రాజ్‌కోట్‌లో జరగనుంది. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతోపాటు విరాట్ కోహ్లీ కూడా జట్టుతో చేరాడు. ఇంతలో రోహిత్, బుమ్రాతో చెతేశ్వర్ పుజారా ఉన్న ఫోటో వైరల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

రాజ్‌కోట్‌లో మూడో వన్డే..

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ప్రస్తుతం చివరి వన్డేలోనూ సత్తా చాటేందుకు రాజ్‌కోట్‌కు చేరుకుంది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ రాజ్‌కోట్‌లోని SCA స్టేడియంలో నేడు జరగనుంది. సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంతో దూసుకపోతోంది. ఈ మ్యాచ్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో రోహిత్‌ ఆడలేదు. మరికొందరు సీనియర్ ఆటగాళ్లతో పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించాడు.

ఇవి కూడా చదవండి

పుజారాతో ఉన్న ఫొటో వైరల్..

సీనియర్ భారత బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో అతను జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మతో కలిసి విమానంలో కనిపించాడు. ప్రస్తుతం పుజారా దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడో వన్డే జరగాల్సిన మైదానం చతేశ్వర్ పుజారా సొంత మైదానం. పుజారా మ్యాచ్ ఆడడంలేదు, అతను జట్టులో భాగం కాదు. కానీ, రాజ్‌కోట్‌కు వెళుతున్న సమయంలో వీరు ముగ్గురు కలిసిన ప్రయాణించారు. ఇదే ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

తిరిగి వచ్చిన ఆటగాళ్ళు..

రోహిత్‌తో పాటు గ్రేట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా మూడో వన్డే నుంచి టీమ్ ఇండియాకు రానున్నారు. ఈ ఆటగాళ్లందరూ మొదటి రెండు వన్డే మ్యాచ్‌లలో భాగం కాలేదు. అతనితో పాటు ఆసియా కప్ ఫైనల్ తర్వాత విశ్రాంతి తీసుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తిరిగి జట్టులోకి రానున్నాడు.

వన్డే సిరీస్ కోసం ఇరు జట్లు..

తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్‌మద్ బుమ్రాహ్, జస్ప్రీతమ్‌మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, ముఖేష్ కుమార్.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, అలెక్స్ కారీ, మార్నస్ లాబుషాగ్నే, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, ఎమ్చెల్ , మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..