Ind vs Pak: ఇండియా-పాక్‌ మ్యాచ్​కు దిమ్మదిరిగే వ్యూస్.. టీ20 హిస్టరీలోనే అత్యధికం.. ప్రకటించిన ఐసీసీ

ఇండియా, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లో టెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌కు క్రేజ్ ఉంటుంది.

Ind vs Pak: ఇండియా-పాక్‌ మ్యాచ్​కు దిమ్మదిరిగే వ్యూస్.. టీ20 హిస్టరీలోనే అత్యధికం.. ప్రకటించిన ఐసీసీ
Ind Vs Pak
Follow us

|

Updated on: Nov 25, 2021 | 9:34 PM

ఇండియా, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లో టెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇరు దేశాల్లోని క్రీడా ప్రేమికులు మాత్రమే కాదు.. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్‌పై ఇంట్రస్ట్ చూపిస్తారు. అన్ని పనులు మానేసుకుని టీవీలకు అతుక్కుపోతారు. లీగ్​ దశలో జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్​లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను జనాలు ఓ రేంజ్‌లో చూశారు. ఏకంగా 167 మిలియన్ల (16.7 కోట్లు) మంది ఈ మ్యాచ్​ వీక్షించినట్లు ఐసీసీ వెల్లడించింది. టీ20 చరిత్రలో ఓ మ్యాచ్​ను ఇంతమంది వీక్షించడం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలిపింది. ఇండియాలో ఈ మ్యాచ్​ను 15.9 బిలియన్​ నిమిషాల పాటు చూసినట్లు వివరించింది. మొత్తం టోర్నీని 112 బిలియన్​ నిమిషాలు వీక్షించినట్లు వెల్లడించింది.

గతంలో 2016 టీ20 వరల్డ్ కప్​ సెమీఫైనల్స్​ మ్యాచ్​కు (టీమ్​ఇండియా-వెస్టిండీస్) 136 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. యుకేలో మిగతా మ్యాచ్​లకు వచ్చిన వ్యూయర్​షిప్​ కన్నా ఇండియా​-పాక్​ మ్యాచ్​కు 60శాతం, ఈ టోర్నీకి ఏడు శాతం పెరిగినట్లు ఐసీసీ వివరించింది. ఈ మెగాటోర్నీకి వ్యూస్​ పెరగడంలో ఫేస్​బుక్​ కీ రోల్ పోషించిందని ఐసీసీ తెలిపింది. ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా 4.3 బిలియన్​ వ్యూస్​ వచ్చినట్లు పేర్కొంది.

Also Read:  ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

 100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్