T20 World Cup 2024: గిటారు వాయిస్తోన్న ఈ కుర్రాడు ఇప్పుడు బ్యాటర్లను డ్యాన్స్ ఆడిస్తున్నాడు.. గుర్తు పట్టారా?

|

Jun 11, 2024 | 7:01 PM

పై ఫొటోలో కూల్‌గా కూర్చోని గిటారు వాయిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్ అభిమానులయితే పోలికలను చూసి గుర్తు పట్టవచ్చు. కానీ సాధారణ జనాలకు మాత్రం ఈ కుర్రాడెవరో కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే ఈ అబ్బాయి ఇప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్.

T20 World Cup 2024: గిటారు వాయిస్తోన్న ఈ కుర్రాడు ఇప్పుడు బ్యాటర్లను డ్యాన్స్ ఆడిస్తున్నాడు.. గుర్తు పట్టారా?
Team India Cricketer
Follow us on

పై ఫొటోలో కూల్‌గా కూర్చోని గిటారు వాయిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్ అభిమానులయితే పోలికలను చూసి గుర్తు పట్టవచ్చు. కానీ సాధారణ జనాలకు మాత్రం ఈ కుర్రాడెవరో కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే ఈ అబ్బాయి ఇప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్. ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ వేదికగా ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచకప్ జరుగుతోంది. ఇందులో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ ను చిత్తుగా ఓడించింది. అయితే రెండో మ్యాచ్ లో ప్రత్యర్థి బలమైన పాకిస్తాన్ జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ చేతిలో మనకు పరాజయం తప్పదని భావించారు. పైగా మ్యాచ్ నైట్ ఉండడంతో చాలా మంది టీవీలు, మొబైల్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోయారు. తీరా ఉదయం చూస్తే ఉత్కంఠ మ్యాచ్ లో ఆరు పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించిందని తెలిసి మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత తెగ సంతోష పడ్డారు. ఈ విజయానికి ముఖ్య కారణం ఎవరో తెలుసు కదా. టీమిండియా రేసు గుర్రం జస్ ప్రీత్ బుమ్రా. పై ఫొటోలో కూల్ గా గిటారు వాయిస్తున్నది బుమ్రానే. ఇది అతని టీనేజ్ ఫొటో. దీనిని చూసిన అభిమానులు బుమ్రాలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.

120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ మొదట 10 ఓవరల్లో నిలకడగానే బ్యాటింగ్ చేసింది. కేవలం బాబర్ ఆజామ్ వికెట్ మాత్రమే కోల్పోయింది. అది కూడా బుమ్రా తీసిందే. అయితే ఎప్పుడెతై బుమ్రా సెకెండ్ స్పెల్ కు దిగాడో పాక్ డీలా పడిపోయింది. బుమ్రా పదునైన బంతులకు పరుగులు చేయలేక పాక్ బ్యాటర్లు క్రీజులో డ్యాన్స్ ఆడాల్సి వచ్చింది. దీంతో వేగంగా పరుగులు చేసే క్రమంలో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 3 కీలక వికెట్లు (బాబర్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్) పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..