AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. ఇప్పటికైనా అతడిని రంగంలోకి దింపడయ్యా సామీ..!

Sunil Gavaskar Comments Team India Opener Sanju Samson: వరుస అవకాశాలను చేజార్చుకుంటున్న సంజూ శాంసన్‌కు రాబోయే రెండో టీ20లో చోటు దక్కడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్‌పై, ముఖ్యంగా కోచ్ గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, తదుపరి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున ఓపెనర్‌గా అరంగేట్రం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. ఇప్పటికైనా అతడిని రంగంలోకి దింపడయ్యా సామీ..!
Gambhir Teamindia
Venkata Chari
|

Updated on: Jul 04, 2026 | 7:15 AM

Share

Sunil Gavaskar Comments Team India Opener Sanju Samson: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయినప్పటికీ, టీమిండియా ఓపెనింగ్ స్థానంపై సరికొత్త వివాదం రాజుకుంది. వరుసగా విఫలమవుతున్న సంజూ శాంసన్‌ స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను గట్టిగా డిమాండ్ చేశారు.

ఇంగ్లాండ్‌తో తొలి సమరం.. వరుణుడి పంజా..!

భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, భారత ఇన్నింగ్స్ సాగుతున్నంత సేపు పడుతూ ఆగుతూ ఇబ్బంది పెట్టిన వర్షం, ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మరింత ఉధృతంగా మారింది. ఎంతసేపటికీ వాన తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరుగుల వరద పారే మ్యాచ్‌ను చూద్దామనుకున్న అభిమానులకు వర్షం తీవ్ర నిరాశను మిగిల్చింది.

మరోసారి నిరాశపరిచిన సంజూ శాంసన్..

భారత ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదైనప్పటికీ, ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ మరోసారి చేతులెత్తేశాడు. ఇప్పటికే ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సంజూ, ఇంగ్లాండ్‌పై కూడా అదే పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 7 బంతులను ఎదుర్కొని, కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తన స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సిద్ధంగా ఉన్నాడని తెలిసి కూడా, సంజూ బాధ్యతారాహిత్యంగా ఆడటంపై అభిమానులు, మాజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక మ్యాచ్‌లో ఆడితే, తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో విఫలమవ్వడం సంజూకు అలవాటుగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రంగంలోకి సునీల్ గావస్కర్.. గంభీర్ నిర్ణయాలపై ప్రశ్నలు..!

సంజూ శాంసన్ వరుస వైఫల్యాల నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ రంగంలోకి దిగారు. వయసుతో సంబంధం లేకుండా అద్భుత ప్రతిభ కనబరుస్తున్న వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని గావస్కర్ మేనేజ్‌మెంట్‌ను గట్టిగా కోరారు. మరోవైపు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సైతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలను తప్పుపట్టారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లను వెనుకేసుకొస్తూ, వైభవ్ లాంటి యువ కిశోరానికి అన్యాయం చేస్తున్నారని కైఫ్ మండిపడ్డారు. రెండో టీ20 నాటికైనా జట్టులో మార్పులు చేయకపోతే కష్టమేనని హెచ్చరిస్తున్నారు.

ఆకట్టుకున్న అభిషేక్, శ్రేయస్ అయ్యర్..

మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ అద్భుతమైన అర్ధ శతకంతో (హాఫ్ సెంచరీ) మెరిశాడు. అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ కావడం కాస్త నిరాశపరిచింది. అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నందున, రెండో టీ20లో అతనికి జోడిగా వైభవ్ సూర్యవంశీని బరిలోకి దించితే ఓపెనింగ్ సమస్య తీరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us