Video: కోహ్లీ నినాదాలతో కోపోద్రిక్తుడైన గౌతమ్ గంభీర్.. ప్రేక్షకులకు అసభ్యకర సైగలు.. వైరల్ వీడియో
అయితే కోహ్లి, గంభీర్ మధ్య ఈ పోరు తాజాగా చోటుచేసులేదు. ఈ పోరాటం చాలా పాతది. ఐపీఎల్ నుంచి కొనసాగుతోంది. 2013లో బెంగళూరు కెప్టెన్గా కోహ్లీ, కోల్కతా నైట్రైడర్స్కు గంభీర్ కెప్టెన్గా ఉన్న సమయంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోహ్లి ఔటైన తర్వాత గంభీర్ ఏదో మాట్లాడాడు. దానికి కోహ్లి సమాధానమిచ్చాడు. గంభీర్ కోపంతో విరాట్తో గొడవకు వచ్చాడు.

Gautam Gambhir vs Virat Kohli: భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. అతని కోపం మరోసారి బయటపడింది. గంభీర్ ప్రస్తుతం ఆసియా కప్-2023లో వ్యాఖ్యానిస్తున్నాడు. సోమవారం భారత్, నేపాల్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో గంభీర్ మైదానం నుంచి తిరిగి వస్తుండగా, అతడిని చూసిన ప్రేక్షకులు కోహ్లి-కోహ్లీ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో గంభీర్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అయితే, కోహ్లి-కోహ్లీ నినాదాలు విన్న వెంటనే కోపంతో మిడిల్ ఫింగర్ చూపించాడు. కోహ్లీ-గంభీర్ మధ్య 2013 నుంచి పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఐపీఎల్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.
ఇటీవల, IPL-2023లో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. గంభీర్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరించగా, విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో బ్యాటింగ్లో నవీన్ ఉల్ హక్, కోహ్లీ మధ్య గొడవ జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ గొడవపడ్డారు. వారి గొడవలో గంభీర్ మళ్లీ జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
గొడవలు ఇప్పటివి కాదు..
— Out Of Context Cricket (@GemsOfCricket) September 4, 2023
అయితే కోహ్లి, గంభీర్ మధ్య ఈ పోరు తాజాగా చోటుచేసులేదు. ఈ పోరాటం చాలా పాతది. ఐపీఎల్ నుంచి కొనసాగుతోంది. 2013లో బెంగళూరు కెప్టెన్గా కోహ్లీ, కోల్కతా నైట్రైడర్స్కు గంభీర్ కెప్టెన్గా ఉన్న సమయంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోహ్లి ఔటైన తర్వాత గంభీర్ ఏదో మాట్లాడాడు. దానికి కోహ్లి సమాధానమిచ్చాడు. గంభీర్ కోపంతో విరాట్తో గొడవకు వచ్చాడు. జట్టు సభ్యులు మళ్లీ జోక్యం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది ఇటీవల IPL-2023 లో మరింత పెరిగింది.
నిరంతరం వార్తల్లో నిలుస్తోన్న గంభీర్..
ఈ ఏడాది ఐపీఎల్లో జరిగిన వివాదం తర్వాత వీరిద్దరి మధ్య పోరు మరింత ముందుకు సాగింది. ఇద్దరి అభిమానులు సోషల్ మీడియాలో ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ ఉంటున్నారు. కోహ్లి గురించి నిరంతరం మాట్లాడే వ్యక్తి గంభీర్. పాకిస్థాన్తో జరిగిన ఆసియా కప్-2023 మ్యాచ్లో కోహ్లీ విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత గంభీర్, స్టార్ స్పోర్ట్స్లో మాట్లాడుతూ కోహ్లీని విమర్శించాడు. అతని షాట్ల ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..