AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరిపై ప్రేమ.. బుడ్డోడిపై కక్ష్య.. నీ ఆటిట్యూడ్‌తో టీమిండియా పరువు తీస్తున్నావ్ గంభీర్

Team India Hypocrisy: విజయాలు సాధించిన సీనియర్ ఆటగాళ్లను భవిష్యత్తు పేరిట పక్కన పెట్టే సెలెక్టర్లు, నిజంగానే భవిష్యత్తుకు పునాది వేయగల వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయడం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఐర్లాండ్ చేతిలో చారిత్రాత్మక ఓటమి ఎదురైన ఈ తరుణంలోనైనా టీమ్ మేనేజ్‌మెంట్ తన తప్పులను సరిదిద్దుకుని, యువ ప్రతిభను ప్రోత్సహిస్తుందని ఆశిద్దాం.

ఆ ఇద్దరిపై ప్రేమ.. బుడ్డోడిపై కక్ష్య.. నీ ఆటిట్యూడ్‌తో టీమిండియా పరువు తీస్తున్నావ్ గంభీర్
Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Jun 30, 2026 | 7:30 AM

Share

Team India Hypocrisy: ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఎదుర్కొన్న చారిత్రాత్మక పరాజయంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరిస్తున్న ద్వంద్వ విమర్శనాత్మక వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై కైఫ్ మేనేజ్‌మెంట్‌ను నిలదీస్తూ, పాత కెప్టెన్ల ఉదాహరణలను తెరపైకి తెచ్చారు.

ఐర్లాండ్ పర్యటనలో ఘోర పరాభవం.. యువ సంచలనానికి మొండిచేయి..!

ఇటీవలే ముగిసిన ఐర్లాండ్ తో టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-0 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ పరాజయంపై విశ్లేషిస్తూ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో టీమ్ మేనేజ్‌మెంట్‌పై నిప్పులు చెరిగారు. ప్రపంచకప్ గెలిచిన జట్టు కాబట్టే అదే కూర్పును కొనసాగిస్తున్నామని, అందుకే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వేచి చూడాలని కోచ్ గంభీర్ చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. సూర్యాంశ్ హెడ్గే, ప్రిన్స్ యాదవ్‌లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చినప్పుడు, అత్యంత ప్రతిభావంతుడైన 15 ఏళ్ల వైభవ్‌ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. ఓపెనర్లుగా వచ్చిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైనా మేనేజ్‌మెంట్ మార్పులకు సాహసించకపోవడం విడ్డూరమన్నారు.

రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ల ప్రస్తావన.. గంభీర్ మార్క్ రాజకీయం?

మేనేజ్‌మెంట్ అనుసరిస్తున్న డబుల్ స్టాండర్డ్స్ ను కైఫ్ తీవ్రంగా కడిగిపారేశారు. “భారత క్రికెట్‌లో నిలకడ లేని నిర్ణయాలు ఎక్కువవుతున్నాయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి శ్రేయాస్ అయ్యర్‌కు పగ్గాలు ఇచ్చారు. భవిష్యత్తును నిర్మించడమే మీ లక్ష్యమైతే, రాబోయే కాలానికి ఆశాకిరణం లాంటి వైభవ్ సూర్యవంశీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు?” అని కైఫ్ గట్టిగా నిలదీశారు.

చరిత్ర సృష్టించిన ఐర్లాండ్.. తీవ్ర ఒత్తిడిలో టీమిండియా..

ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఈ సిరీస్ ఓటమి భారత క్రికెట్ చరిత్రలోనే ఒక పెద్ద మచ్చగా మిగిలిపోనుంది. అంతకుముందు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ భారత్ చేతిలో ఓడిపోయిన ఐర్లాండ్, ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి మ్యాచ్‌లో భారత్‌ను కేవలం 148 పరుగులకే ఆలౌట్ చేసి 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక పరాజయంతో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్‌లపై విమర్శల వర్షం కురుస్తోంది. జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న సిరీస్‌లోనైనా జట్టు పుంజుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us