AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ఇప్పుడే గాడిలో పడుతోందనుకుంటోన్న వేళ..

Gary Kirsten: పాకిస్థాన్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ ఎంపిక తర్వాత, గ్యారీ కిర్‌స్టన్ పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారు. కాబట్టి త్వరలో పాకిస్థాన్ జట్టుకు కొత్త కోచ్‌ని నియమించనున్నట్లు తెలుస్తోంది.

Pakistan: పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ఇప్పుడే గాడిలో పడుతోందనుకుంటోన్న వేళ..
Gary Kirsten
Venkata Chari
|

Updated on: Oct 28, 2024 | 6:13 PM

Share

Gary Kirsten: పాకిస్తాన్ క్రికిట్ ప్రస్తుతం విజయాల బాట నడుస్తోంది. మొన్నటి వరకు వరుస పరాజయాలతో చెత్త రికార్డులు నెలకొల్పిన వేళ.. తాజాగా మరో బిగ్ షాక్ తగలడంతో ఆందోళన నెలకొంది. దీంతో మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లైంది. ఎందుకంటే, పీసీబీతో కోచ్ గ్యారీ కిర్ స్టెన్ కు అంతగా పడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ పరిమిత ఓవర్ల జట్ల ప్రధాన కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేయడంతో.. మరోసారి విభేదాలు బయటపడ్డాయి. కిర్‌స్టన్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), కొంతమంది ఆటగాళ్లతో విభేదాలు ఉన్నాయని, తద్వారా కోచ్‌గా నిష్క్రమించాడని నివేదికలు వెల్లడవుతున్నాయి. దీనికి ముందు, కిర్‌స్టన్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటారని వార్తలు వచ్చాయి. అలాగే, నవంబర్ 4న మెల్‌బోర్న్‌లో ప్రారంభమయ్యే మూడు వన్డేల, టీ20 సిరీస్ కోసం అతను పాకిస్తాన్ జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా కోచ్‌ను భర్తీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఇప్పుడు ఈ నివేదిక నిజమైంది. గ్యారీ కిర్‌స్టన్ కేవలం 6 నెలల్లో పాకిస్తాన్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడి ఈ నిర్ణయం వెనుక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య విభేదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

పాకిస్తాన్ జట్టు హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా డేవిడ్ రీడ్‌ను నియమించాలని కిర్‌స్టన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి విజ్ఞప్తి చేశాడు. అయితే ఈ అభ్యర్థనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించలేదు. దీంతో పీసీబీకి, కోచ్‌కి మధ్య విభేదాలు తలెత్తాయి.

గ్యారీ కిర్‌స్టన్‌కు కొంతమంది ఆటగాళ్లతో మంచి సంబంధాలు లేవు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డుకు కూడా ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నింటి కారణంగా కిర్‌స్టన్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడు.

గ్యారీ కిర్‌స్టన్ గతంలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా కనిపించారు. ముఖ్యంగా 2011లో కిర్‌స్టన్ సారథ్యంలో టీమిండియా వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత, గ్యారీ కిర్‌స్టన్ IPL కోచ్‌గా కనిపించాడు. 2024లో పాకిస్థాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన కిర్‌స్టన్ నేతృత్వంలోని పాక్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ గెలిచిన పాకిస్థాన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కోల్పోయింది.

టీ20 ప్రపంచకప్‌లో అమెరికా, భారత్‌లపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ రాబోతుంది. అంతకంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త కోచ్‌ని నియమించే అవకాశం ఉంది.

పాకిస్థాన్ జట్టు కొత్త కోచ్‌ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ పేరు ముందు వరుసలో ఉంది. గిలెస్పీ ఇప్పటికే పాకిస్థాన్ టెస్టు జట్టు కోచ్‌గా పనిచేస్తున్నాడు. అందువల్ల, అతనికి పరిమిత ఓవర్ల జట్ల కోచ్ పదవి లభించే అవకాశాన్ని తోసిపుచ్చలేం.

అతనితో పాటు పాక్ జట్టు మాజీ పేసర్ అకిబ్ జావేద్ పేరు కూడా వినిపిస్తోంది. కాబట్టి గ్యారీ కిర్‌స్టన్ స్థానంలో కొత్త కోచ్‌గా గిలెస్పీ లేదా అకిబ్‌ను నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..