IPL 2025: ఐపీఎల్ సస్పెన్షన్ పై స్పందించిన దాదా! నేను నమ్ముతున్నాను అంటూ మాస్ కామెంట్స్..
భారత-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా IPL 2025 సస్పెన్షన్ విషయంపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, బీసీసీఐపై తన నమ్మకాన్ని వెల్లడించాడు. కోవిడ్ సమయంలో విజయవంతంగా టోర్నీ నిర్వహించినట్లు గుర్తుచేస్తూ, ఇప్పుడు కూడా బోర్డు సమర్థంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానుల భద్రతను ముందుగా చూసిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు అంకితభావంతో సైనికుల త్యాగాన్ని గౌరవించడం అవసరమని గంగూలీ పేర్కొన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ మధ్యలో సస్పెన్షన్కు గురవడం భారత క్రికెట్లో పెద్ద పరిణామంగా మారింది. ఆపరేషన్ సిందూర్ తరువాత భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా మే 8న పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ను మధ్యలోనే రద్దు చేశారు. ఈ ఘటన తర్వాత మరుసటి రోజు BCCI ఐపీఎల్ను తాత్కాలికంగా ఒక వారం పాటు నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామంపై భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, బోర్డుపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ‘‘కోవిడ్ సమయంలో కూడా ఇలాంటి అత్యవసర పరిస్థితిలో బీసీసీఐ సమర్థవంతంగా వ్యవహరించింది. ఇప్పుడూ అదే విధంగా టోర్నమెంట్ను పూర్తి చేస్తుందని నాకు నమ్మకం ఉంది’’ అని గంగూలీ పేర్కొన్నాడు. అతను జవాన్ల త్యాగాన్ని గౌరవిస్తూ, ‘‘మేము ప్రశాంతంగా ఉన్నాం అంటే అది వారి త్యాగాల వల్లే’’ అంటూ భారత సాయుధ దళాలను అభినందించాడు.
ఈ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, ‘‘పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసిన తర్వాత టోర్నమెంట్కు సంబంధించి కొత్త షెడ్యూల్, వేదికలను త్వరలో వెల్లడిస్తాం’’ అని తెలిపారు. గురువారం రాత్రి జమ్మూ, ఉధంపూర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్ దాడుల కారణంగా దేశంలో భద్రతా పరిస్థితి అప్రమత్తంగా మారింది. ధర్మశాలలో HPCA స్టేడియంలో మొదటి ఇన్నింగ్స్ 10.1 ఓవర్లకే ఆగిపోవడంతో, మ్యాచ్ను పూర్తిగా రద్దు చేశారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, వ్యాఖ్యాతలు, ప్రసార బృందం సహా మొత్తం సిబ్బందిని ధర్మశాల నుంచి జలంధర్కి తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా న్యూఢిల్లీకి పంపించారు.
ఈ క్రమంలో, సస్పెన్షన్కు సంబంధించి అనేక ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల మనోభావాలను తెలియజేయడంతో పాటు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు, అభిమానుల ఆందోళనలను బోర్డుకు తెలియజేశాయి. దీంతో IPL పాలక మండలి, కార్యదర్శి సైకియా, చైర్మన్ అరుణ్ ధుమాల్ నేతృత్వంలో అన్ని కీలక వాటాదారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCCI వెల్లడించింది. ఐపీఎల్ను ముందుగా 2021లో కోవిడ్ కారణంగా నిలిపివేసిన అనుభవాన్ని ఈసారి ఉపయోగించుకుని, పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించేందుకు బోర్డు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఈ చర్యలు క్రికెట్ కంటే దేశ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని సూచిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..